సంక్షేమమే తన ప్రాధాన్యమంటారు ఏపీ సీఎం జగన్. సంక్షేమం అంటే ప్రజాదరణ ఉన్న పథకాలే కాదు.. పించన్లు, బియ్యం, అమ్మఒడి వంటి పథకాలే కాదు.. సామాజిక మార్పు కూడా ఆయన ఎజెండాలో భాగంగానే ఉంది. ఈ విషయం మరోసారి రుజువైందంటున్నారు ఉప ముఖ్య మంత్రి ఆళ్ల నాని.. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ట్రస్ట్‌ బోర్డులో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బడుగు, బలహీన వర్గాలు, మధ్య తరగతి కుటుంబాలకు చోటు కల్పించారని ఆళ్ల నాని పేర్కొన్నారు.

 

 

పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం.. దీన్ని చిన్న తిరుపతి అని కూడా భక్తులు పిలుచుకుంటారు. తిరుపతి వరకూ వెళ్లలేని భక్తులు ఈ చిన్న తిరుపతిలో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.. ఈ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థాన నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది. మొత్తం 16 మంది సభ్యులతో దేవస్థాన పాలక మండలి ఏర్పాటైంది. పాలకమండలి సభ్యులతో ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ప్రమాణస్వీకారం చేయించారు.

 

IHG

 

హిందూ సంప్రదాయాలను కాపాడుతూ ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరికి దేవుడి ఆశీస్సులు అందించాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారకా తిరుమల నూతన పాలకమండలిని ఏర్పాటు చేశారని తెలిపారు. సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌.. ట్రస్ట్ బోర్డులో బడుగు, బలహీన వర్గాల వారితో పాటు మధ్యతరగతి వారికి చోటు కల్పించారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. ట్రస్ట్ బోర్డులో మెంబర్‌గా ఉన్నవారు కొంత సమయం కేటాయించి దేవుడికి సేవ చేయడంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కోరారు.

 

 

ద్వారకా తిరుమల దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చెప్పారు. ఈ ప్రమాణ స్వీకారమహోత్సవ కార్యక్రమంలో ఎంపీ మార్గాన్ని భరత్, ఎమ్మెల్యేలు పుప్పాల వాసు, బాబు తలారి వెంకట్రావు, పాలక మండలి ఆలయ ఛైర్మన్ యస్.వి. సుధాకర్ రావు తదితరులు హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: