ఏంటో లోకంలో డబ్బుకు అసలు విలువ ఉండదని చెబితే నమ్మని వారు ఎందరో ఉన్నారు.. కాని ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని కొన్ని పెళ్లిలను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.. ఎందుకంటే ఒక పెళ్లి చేయాలంటే వందల కోట్లను మంచినీళ్లలా ఖర్చుచేస్తున్న ధనవంతులు మనదేశంలో ఉన్నారు.. ఇలాంటి వారిని చూస్తే పేదవారి గుండెలు ఒక్క క్షణం ఆగిపోతాయనిపిస్తుంది..

 

 

ఆ మధ్యకాలంలో మైనింగ్‌ కింగ్ గాలి జనార్ధన్‌రెడ్డి తన కూతురు బ్రహ్మాణి వివాహానికి 500 కోట్లు ఖర్చు చేస్తే అందరూ నోరెళ్లబెట్టారు. ఇంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందంటూ లబోదిబోమన్నారు. ఇప్పుడు ఆయన శిష్యుడు, ప్రస్తుత కర్నాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు తన కుమార్తె వివాహానికి 600 కోట్లు ఖర్చు చేస్తున్నాడు. గురువు రికార్డును బద్దలగొడుతున్నాడు.. ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

బళ్లారి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌కు చెందిన లలిత్‌ సంజీవరెడ్డితో ఈ నెల 5న  బెంగళూరు ప్యాలెస్‌ గ్రౌండ్‌లో జరగనుంది. కాగా ఫిబ్రవరి 27నుంచే పెళ్లి హడావిడి మొదలైంది. ఈ ఖరీదైన వివాహానికి భారీ ఎత్తున సన్నహాలు జరుగుతున్నాయి.. అంతే కాకుండా ఎందరో ప్రముఖులను ఈ వివాహానికి ఆహ్వానిస్తున్నారు.. ఇక పెళ్లి మొదలు అది ముగిసేవరకు ప్రతి విషయంలో చేస్తున్న ఖర్చు చూస్తుంటే ఇది పెళ్లి సెట్టా, లేక ఏదైనా సినిమా సెట్టింగా అనేలా రూపొందిస్తున్నారు..

 

 

ఇలా అనువణువు ఓ ప్రత్యేకతను సంతరించుకునేలా శ్రద్ద తీసుకుంటున్నారు.. ఇలా మొత్తానికి పెళ్లి వేడుకలు బాలీవుడ్ సినిమాలను తలదన్నేలా కనిపిస్తున్నాయి. సంగీత్‌, మెహెందీ, హల్దీ సెర్మనీలు సంప్రదాయ బద్దంగా జరుగుతున్నాయి. నృత్య కళాకారిణులు పెళ్లి  తంతుకు మరింత జోష్‌ నింపుతున్నారు... విందుభోజనాలు మామూలుగా లేవు. ఉత్తర కర్నాటక స్పెషల్‌ వంటకాల కోసం దాదాపు వెయ్యి మంది చెఫ్‌లు ఈ ఖరీదైన పెళ్లిలో వండి వార్చనున్నారు.. వీరి పెళ్లి వేడుకలు చూస్తుంటే డబ్బు ఉన్నవారి దర్పానికేం కొదువ అనిపిస్తుందట కొందరికి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: