ప్రేమ పేరుతో ఎంతో మంది యువకులు యువతులను మోసగిస్తున్నారు. కానీ... ఈ రోజుల్లో ప్రేమ అంటే.. ఇరువురి మధ్య శారీరక సంబంధం లాగే ఉంది. ఆ ఒక్క సుఖం కోసమే దానికి ప్రేమ అని పేరు పెట్టి యువతులను బలి తీసుకుంటున్నారు కొంతమంది నీచ్యులు.. తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించానని యువతిని నమ్మించి.. యువతిని లొంగదీసుకుని ఆపై  గర్భవతిని చేశాడు. గర్భవతిని చేసిన యువకుడి పై విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

 

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి చెందిన యువతి విజయవాడ సూర్యారావుపేటలోని ఓ ఓల్డేజ్‌ హోమ్‌ లో పనిచేస్తోంది. ఏడాది కిందట ఓ వృద్ధురాలికి సేవలందించే నిమిత్తం ఓల్డేజ్‌ హోమ్‌ నిర్వాహకులు ఆమెను నెల్లూరు నగరానికి పంపించారు.

 

 

అక్కడ ఆ అమ్మాయికి షేక్‌ షఫీ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తర్వాత ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇద్దరు చట్టాపట్టాలేసుకుని తిరిగాడు. ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. మూడు నెలల తర్వాత ఆమె విజయవాడ వచ్చేయగా.. షఫీ తరచు విజయవాడ వచ్చి ఓ హోటల్‌ లో గదిని అద్దెకు తీసుకుని ఆమెతో గడిపేవాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చడంతో ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకుందామని చెప్పి షఫీ తర్వాత ఫోన్ లిఫ్ట్ మానేశాడు.

 

 

దీంతో మనస్తాపానికి గురైన యువతి ఫిబ్రవరి 14న విజయవాడ బస్‌ స్టేషన్‌ లో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు దిశ వన్‌స్టాప్ సెంటర్‌కు సమాచారం ఇచ్చారు. యువతి వివరాలు సేకరించి గూడవల్లిలోని రెస్య్యూ హోమ్‌కు తరలించారు. అక్కడ ఆమెకు ఫిట్స్‌ రావడంతో నిర్వాహకులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితురాలుకు మృత శిశువు జన్మించాడు. అవుట్‌పోస్ట్‌ పోలీసులు ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షఫీ ఆచూకీ కోసం నెల్లూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. షఫీ వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: