తెలుగుదేశంపార్టీ లో మాజీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే వీళ్ళు అసలు మంత్రులుగా ఎలా పనిచేశారా అనే డౌట్ వస్తోంది. ఫించన్లు ఇవ్వటం కోసం వాలంటీర్ల పేరుతో జగన్మోహన్ రెడ్డి రూ. 1600 కోట్లు వృధా చేస్తున్నాడంటూ మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉంది. వాలంటీర్ల వ్యవస్ధను జగన్ ఫించన్ల కోసమే ఏర్పాటు చేయలేదన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అందరికీ తెలిసిన విషయం కూడా అచ్చెన్నకు తెలీకపోవటమే వింతగా ఉంది.

 

వాలంటీర్లు చేయాల్సిన అనేక పనుల్లో ఫించన్లు అందచేయటం కూడా ఒకటి. మొన్నటికి మొన్న ప్రభుత్వం ప్రిస్టేజిగా తీసుకుని 1వ తేదీన ఆదివారం అయినా సరే వాలంటీర్ల ద్వారా అందిరికీ ఫించన్లు ఇవ్వాలని డిసైడ్ చేసింది. మొత్తం 59 లక్షలమంది ఫించన్ దారులకు గాను ప్రభుత్వం సుమారు 50 లక్షల మందికి ఫించన్లను పంపిణీ చేసి దేశంలోనే రికార్డు సృష్టించింది. ఒకేరోజు 50 లక్షల మందికి ఫించన్లు అందటంతో లబ్దిదారులు కూడా ఫుల్లు హ్యాపీగా ఉన్నారు.

 

ఎప్పుడైతే ఫించన్ల పంపిణీ గ్రాండ్ సక్సెస్ అయిందో టిడిపి నేతల్లో కడుపునొప్పి మొదలైపోయింది. మొహాలు మాడిపోయాయి. ఎక్కడ బొక్కలు దొరుకుతాయా అని చూశారు. ఎక్కడా దొరకకపోగా రోగులకు, ముసలి వాళ్ళకు, మొబైల్ సిగ్నల్స్ అందని చోట ఉన్నలబ్దిదారులకు కూడా వాలంటీర్లు తమ బాధ్యతగా వెళ్ళి ఫించన్లను అందచేశారు. దాంతో   వాలంటీర్ల కు రూ. 1600 కోట్ల ప్రజాధనాన్ని తగలేశాడంటూ జగన్ పై ఆరోపణలు మొదలుపెట్టేశాడు.

 

వాలంటీర్ల కోసం జగన్ 1600 కోట్ల ఖర్చు పెట్టలేదన్న విషయం తెలీక కాదు అచ్చెన్న నోటికొచ్చింది మాట్లాడింది. కడుపుమంటను తట్టుకోలేకే అలా మాట్లాడాడు. సంక్షేయ పథకాల అమలుతో జగన్ జనాల్లోకి దూసుకుపోతున్నాడని తెలుస్తోంది కాబట్టే ఎలాగైనా జగన్ పై బురద చల్లాలనే మంటతోనో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: