కామం ఎంతటి దారుణానికి అయినా దారి తీస్తుంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడిన మహిళ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులో జరిగింది. ఆమెతో బెడ్రూమ్‌లో ఏకాంతంగా ఉన్న సమయంలో పదేపదే ఫోన్లు రావడంతో చిరాకు పడిన ప్రియుడు కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. 

 

తిరుప్పూర్ జిల్లా పల్లడమ్ ప్రాంతానికి చెందిన సెల్వీ అలియాస్ బేబీ(30) తూత్తుకుడిలోని ముత్తయాపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. భర్త లేకపోవడంతో నేతాజీ నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. అడ్డు చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో సెల్వీ విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడింది. తాను పనిచేసే సంస్థలో ఉద్యోగులతో పాటు స్థానికంగా ఉండే మరికొందరితోనూ ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. 

 

ఆమె వ్యవహారాన్ని గమనించిన ఇంటి యజమాని సెల్వీని ఖాళీ చేయించేశాడు. దీంతో ఆమె నేతాజీనగర్‌‌లో మరో ఇంటిని అద్దెకు తీసుకుంది. అదే ప్రాంతానికి చెందిన ఎడ్విన్ అనే వ్యక్తితో ఆమెకు అప్పటికే అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. అతడితో పాటు నేతాజీనగర్‌లోనే అనేక మంది పురుషులతో సెల్వీకి అఫైర్లు ఉన్నాయి. 

 

ప్రియురాలి ఇంటికి వచ్చిన కురుప్పసామి ఆమెతో కామకలాపాలు మొదలుపెట్టాడు. అదే సమయంలో సెల్వీ ఫోన్‌కు వరుసగా కాల్స్ రావడం మొదలయ్యాయి. వాటితో విసిగిపోయిన కురుప్పసామి ఫోన్‌ను కాసేపు సిచ్ఛాఫ్ చేయాలని కోరాడు. ఆమె సిచ్ఛాఫ్ చేయనని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన కురుప్పసామి కత్తి తీసుకుని సెల్వీ గొంతు కోసేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే చనిపోవడంతో శవంపై పెట్రోల్ పోసి దహనం చేసి వెళ్లిపోయాడు.

 

సెల్వీ హత్య కేసును దర్యాప్తు చేసే సమయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె సుమారు 10 మంది మగాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుందని, వారంతా అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చి ఏకాంతంగా గడిపి వెళ్తుంటారని పోలీసులకు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: