ఓ వైపు మృగాల అత్యాచారాలపై దేశంలో ఎన్నో చట్టాలను తీసుకొచ్చినప్పటికీ కామాంధుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఎన్ని కఠిన చర్యలు వచ్చినప్పటికి మహిళలపై, చిన్న పిల్లపై అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు. అభం శుభం తెలియని పసి పిల్లల నుండి పండు ముసలి వరకు వారికీ రక్షణ లేకుండా పోయింది. రోజుకు ఎదో ఒక్క ప్రాంతంలో ఎవరో ఒక్కరు కామాంధుడి చేతిలో బలి అవుతూనే ఉన్నారు.

 

బయటికి వెళ్లిన ఆడపిల్ల ఇంటికి క్షేమంగా వచ్చే వరకు గ్యారంటీ లేకుండా పోయింది. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లకి పగలే రక్షణ లేకుండా పోయింది. రోజు రోజుకు కామపిశాచాల ఆగడాలు ఎక్కువైతున్నాయి. ఒక్కపుడు ఆడపిల్ల పుడుతుంది అని తెలిస్తే భయపడేవారు. కానీ ఇప్పుడు ఆడపిల్లలకు రక్షణ లేక భయపడుతున్నారు.

 

పాఠశాలకి వెళ్లిన అమ్మాయి ఇంటికి తిరిగి స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేందుకు స్కూల్ వ్యాన్ ఎక్కిన బాలికను డ్రైవర్ సహా అతని స్నేహితులు దారుణంగా రేప్ చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

 

స్కూల్ విద్యార్థినిపై ఏడుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన షాజపూర్ జిల్లా శుజల్‌పూర్‌లో వెలుగుచూసింది. స్కూల్ నుంచి ఇంటికెళ్తున్న విద్యార్థిని(13)పై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అజయ్ ఖటి కన్నేశాడు. బాలికను కిడ్నాప్ చేసి ఊరికి దూరంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే వేచిచూస్తున్న తన స్నేహితుడు అమిత్‌ని ఎక్కించుకున్నాడు.

 

అక్కడి నుంచి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి బాలికను తీసుకెళ్లారు. అక్కడ మాటువేసి ఉన్న మరో ఐదుగురు స్నేహితులతో కలసి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడుగురు కామాంధులు ఆమెపై పడి తమ పశువాంఛ తీర్చుకున్నారు. ఆమెను దారుణంగా రేప్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: