మోసాలు ,దారుణాలు ఎక్కడ పడితే అక్కడ. సహజీవనం చేస్తూ పెద్దలని ఒప్పించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తున్నారు. ఇప్పుడే మరో అమ్మాయి మోసపోయిన కేస్ వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో నమ్మించి సహజీవనం చేస్తూ....చివరికి మోసం చేసి వదిలేసి పారిపోతున్నారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వార్త వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ పాతబస్తి మల్లేపల్లిలోని మాంగార్ బస్తీకి చెందినవాడు రహీమ్. 35 సంవత్సరాలు రహీంకి. రహీం కూలిపనులు చేస్తూ ఉంటాడు. అదే ప్రాంతానికి చెందిన 25 సంవత్సరాలకి చెందిన యువతిని మోసం చేసాడు. పెళ్ళి చేసుకుంటానని రెండు సంవత్సరాలు పటు ఆమెని నమ్మించాడు. ఇంట్లోనే సహజీవనం చేసారు ఇరువురు. అయితే ఇటువంటి దారుణాలకు అంతు లేకుండా పోతోంది.
సహజీవనం చేస్తూ పెళ్ళి చేసుకుంటానని మొదట మాయమాటలు చెబుతున్నారు. ఆ తర్వాత ముఖం తిప్పేసుకుని నిలువునా స్త్రీలని ముంచేస్తున్నారు. నిజంగా ఎందరో మహిళలు ఇలాంటి పశువుల చేతిలో మోస పోతున్నారు. నిజంగా ప్రేమిస్తూ కటిక ఘోరాలని అనుభవిస్తున్నారు చివరకు.
అయితే ఇటువంటి ఘటనలు అనేక ప్రాంతాలలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రేమ అంటూ ముందుకి వస్తున్నారు. ఆ తర్వాత పెళ్ళి పేరుతో మోసం చేస్తున్నారు. సహజీవనం కొంత కాలం చేసి ఆడవారిని ఆడిపోసుకుంటున్నారు. చివరికి భారంగా మార్చుతున్నారు బతుకుని. ఇలా ఎందరో స్త్రీలు వీరి చేతినపడి మోసపోతున్నారు.
అయితే రహీమ్కి గత సంవత్సరం డిసెంబర్ లో ఒక యువతితో వివాహం అయ్యిపోయింది. ఆమెని ఇంట్లోనే పెట్టి కాపురం చేసాడు. ఇందుకోసం మొదటి భార్య నిలదీయగా ఇంట్లో నుండి వెళ్ళకొట్టాడు. ఆమెకి అన్యాయం జరిగినందుకు పోలీసులకి మంగళవారం రాత్రి ఫిర్యాదు చేసింది. దీనికి పోలీసులు స్పందించి రహీంపై తన కుటుంబంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోసం చేసిన రహీంపై వెంటనే కేసు నమోదు చేసారు పోలీసులు.