దుబాయ్‌లో చదువుని కొనసాగిస్తున్న భారతీయ విద్యార్థికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే తనకు తమ తల్లిదండ్రుల నుంచి కోవిడ్ -19 వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వారం రోజులు పాటు విదేశీ పర్యటనకు వెళ్లి, ఇటీవలే దుబాయ్ తిరిగొచ్చిన సదరు విద్యార్థి అమ్మ నాన్నలకు కరోనా వైరస్ సోకడం మూలాన వారి నుంచి అతడికి కూడా ఇన్‌ఫెక్షన్ సోకిందని గల్ఫ్ న్యూస్ గురువారం అనగా ఈరోజు  వెల్లడించింది. 

 

దుబాయ్ హెల్త్ అథారిటీ (డీహెచ్‌ఏ) కూడా దీన్ని ధ్రువీకరించినట్లు మనకు తాజా సమాచారం. ఇక బాధిత విద్యార్థిని, అతడి తల్లిదండ్రులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు, మరేమి ప్రమాదం లేనట్లు వారు పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా గురువారం నుంచి విద్యా సంస్థను మూసివేస్తున్నట్టు దుబాయ్‌లోని ఇండియన్ హై గ్రూప్ ఆఫ్ స్కూల్ ప్రకటించడం ఇక్కడ కొసమెరుపు.

 

సదరు పాఠశాల విద్యార్థులు, సిబ్బంది, యాజమాన్యానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజా కేసుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27కి చేరిందని అరబ్ ఎమిరేట్స్ ఆరోగ్య శాఖ అధికారులు ఒక అంచనాకి వచ్చారు. ఇక మన భారత్‌లో గురువారం నాటికి కరోనా వైరస్ కేసుల సంఖ్య 30కి పెరగగా.. తాజాగా గజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

 

అయితే.. కరోనా అనుమానిత లక్షణాలతో మన దేశంలో మొత్తం 19 వేల మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ వారు కాసేపటి క్తితమే వెల్లడించారు. ఆరోగ్య నిపుణులు కరోనాను ఉద్దేశించి, దానికి ఇంకా విరుగుడు కనుగొనలేదని, సోషల్ మీడియాలో వచ్చిన, వస్తున్న బూటకపు మాటలను నమ్మొద్దని... అయితే దీనికి ముందస్తు సెల్ఫ్ జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమైన పధ్ధతి అని వారు జనులకు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: