మనిషి మనుసులో పుట్టే కోరికలే అన్ని అనర్ధాలకు మూలం.. ఈ కోరిక వయస్సును, వరసలను కూడా మరిచి పశువుకంటే హీనంగా ప్రవర్తించేలా చేస్తుంది.. విషం కంటే ప్రమాదకరమైన ఈ కోరికల కోరలకు చిక్కుని మనుషులు తమ జీవితాలను పాడు చేసుకోవడమే కాకుండా.. ఇంతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేస్తున్నారు.. పదిమందిలో పరువు తీసుకుంటున్నారు.. కన్న వారికి కడుపు కోత పెడుతున్నారు..

 

 

ఈ మధ్య కాలంలో కన్నకొడుకుల భార్యలపై కన్నేస్తున్న కామాంధులు సమాజంలో ఎక్కువగా తయారవుతున్నారు.. కొడుకు సంసారాన్ని సన్మార్గంలో నడిచేలా ప్రోత్సహించ వలసిన వయస్సులో, కోడళ్లపై కోరికలతో రగిలిపోతున్నారు.. ఇలాంటి మామ చేతిలో పడిన ఓ మహిళ బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్న ఘటన ఆడపిల్లలను కలిచివేస్తుంది.. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...

 

 

బషీర్‌బాగ్‌లోని పూల్‌ బాగ్‌కు చెందిన కె.ప్రియాంక (25), లోయర్‌ ట్యాంక్‌బండ్, గాంధీనగర్‌కు చెందిన రమేష్‌ ఇద్దరూ ప్రేమించుకుని ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఏడు నెలల కూతురు కూడ ఉంది. కాగా కొంత కాలంగా రమేష్‌ తండ్రి వెంకటేష్‌ (50) కోడలు ప్రియాంకను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడట.

 

 

ఈ కామాంధుడి చేష్టలు చాలా సార్లు తన కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లగా.. అప్పట్లో పెద్దలు మాట్లాడి తండ్రి లాంటి వాడని నచ్చచెప్పడంతో తిరిగి అత్తవారింటికి వెళ్లిందట ప్రియాంక... అయినా కామంతో కళ్లు మూసుకున్న ఆ మామ కోరిక చల్లార్చుకోవడానికి తరచుగా ప్రియాంకను వేధిస్తున్నాడట.. ఈ క్రమంలో డ్యూటికి వెళ్లుతున్న భర్త రమేష్ తన భార్య ప్రియాంకను, కూతురును పూల్‌బాగ్‌లోని వారి తల్లిదండ్రుల ఇటివద్ద బుధవారం సాయంత్రం వదిలి వెళ్లాడు.

 

 

అలా వదిలి వెళ్లిన కొంత సమయం తర్వాత బయటకు వెళ్లిన రమేష్ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా తలుపు గడియపెట్టి కనిపించిందట.. కిటికీలోనుండి లోపలికి చూడగా వారికి ప్రియాంక ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ ఉండడం కనిపించిందట.. వెంటనే తలుపులు పగల కొట్టి లోనికి వెళ్లి చూడగా ప్రియాంక అప్పటికే మరణించిందట.. ఇకపోతే ప్రియాంక తండ్రి నర్సింగరావు ఫిర్యాదు మేరకు సైఫాబాద్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: