కామాంధులు కనీసం చిన్న పిల్లలను కూడా వదలటం లేదు. వావి వరుసలు లేకుండా తమ కామ వాంఛను తీర్చుకుంటున్నారు. రోజుకు ఇలా ఎంతో మంది మహిళలు, యువతులు, బాలికలు వారికి బలి అవుతున్నారు. ఆ కామాంధులు కనీసం వారి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా.. వారి ఇష్టానుసారంగా చేస్తున్నారు. అయితే.. తాజాగా ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు తమ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

 

 

వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేట్ పాఠశాలలో బాలిక నాలుగో తరగతి చదువుతోంది. అయితే ఆ పాఠశాల ఉపాధ్యాయుడు బాలికల పట్ల లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్లు గమనించిన గ్రామస్థులు ఆ ఉపాధ్యాయున్ని చితక్కొట్టారు. కాగా., ఈ ఘటన వనపర్తి జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దూరు గ్రామానికి చెందిన శరత్ కుమార్ అనే కామాంధుడు గత మూడు సంవత్సరాలుగా వనపర్తి జిల్లాలోని ఓ గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్నాడు. గురుకుల పాఠశాలల్లో ప్రవేశం సాధించేందుకు 4వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తుంటాడు.

 

 

అయితే.. గ్రామస్తుల వివరాల ప్రకారం బాలికలు ఆయా సబ్జెక్టుల్లో ఏమన్నా సందేహాలు అడిగితే పాఠశాలలో చెప్పకుండా ఆ విద్యార్థినులను ఇంటికి రమ్మని, అక్కడే సందేహాలు చెప్తానని అనేవాడు. కుటుంబసభ్యులను ఇంట్లో లేకుండా చూసుకొని చిన్న పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపారు.

 

 

 కాగా., ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని వారిని బెదిరించే వాడని తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం ఆ కామాంధుడి వద్దకు ఓ బాలిక వెళ్ళింది. అనంతరం ఇంటికి వచ్చిన బాలిక స్నానం చేస్తుండగా బాలికకు రక్తస్రావం కావటంతో అది చూసిన తల్లి భయపడి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేల్చారు. ఇది విన్న తల్లి ఆ బాలికను ప్రశ్నించగా మొత్తం విషయం చెప్పింది. ఇలా బాలికలను ఇంటికి పంపడం వల్లే ఇలా జరుగుతుందని గుర్తించిన తల్లిదండ్రులు శరత్ కుమార్ ఇంటికి వెళ్ళారు.

 

 

 తాను ఇంటి దగ్గర లేకపోవటంతో కొల్లాపూర్ వెళ్లాడని తెలుసుకున్న కుటుంబసభ్యులు అతన్ని వెళ్లి పట్టుకుని తీసుకువచ్చారు. అనంతరం గ్రామస్థులతా కలిసి ప్రశ్నించగా మద్యం మత్తులో తప్పుచేశానని ఒప్పుకున్న శరత్ కుమార్ ను అందరూ కలిసి అతడికి దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: