బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మీద రెండు రోజుల క్రితం ఒక పబ్ లో జరిగిన దాడి ఇప్పుడు సంచలనంగా మారింది. బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన ఈ పాప్ సింగర్ తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళగా... అతని మీద వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తమ్ముడు దాడి చేసారు. దీనితో ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపుతుంది. టాలీవుడ్ జనాలు కూడా దీని గురించి చర్చించుకోవడం విశేషం. ఇక అతని మీద దాడి చేసిన వాళ్ళ మీద ఫిర్యాదు చేయని ఈ పాప్ సింగర్ తర్వాత మనసు మార్చుకుని ఫిర్యాదు చేసాడు.
ఇక ఇప్పుడు తన మీద దాడి చేసిన వాళ్ళ మీద తెలంగాణా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. దాడి ఘటన నుంచి ఇప్పుడే బయటకు వస్తున్న ఈ యువ సింగర్ ఇప్పుడు ఏకంగా కేటిఆర్ కి ట్వీట్ చేసాడు. తెలంగాణా పురపాలక శాఖా మంత్రిగా ఉన్న కేటిఆర్ తనకు న్యాయ౦ చెయ్యాలని అతను కోరాడు. తన మీద దాడి జరిగిన వీడియో ని పోస్ట్ చేస్తూ పైన ఫిర్యాదు కూడా రాసాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇది అని పేర్కొంటూ... తన మీద ఈ గ్యాంగ్ ఏ విధంగా దాడి చేసిందో చూడాలని కోరాడు.
దయచేసి ఈ వీడియో చూడాలని కేటిఆర్ ని కోరాడు. అలాగే మీరు న్యాయం వైపు నిలబడాలి అంటూ... మీకు ఏది న్యాయం అనిపిస్తే అది చెయ్యాలి అంటూ ట్వీట్ చేసాడు. తాను తెరాస కు ఓటు వేసా అని చెప్పాడు ఆ ట్వీట్ లో. తాను ఈ తెలంగాణా గడ్డ మీద పుట్టా అని... బ్రతికి ఉన్నన్ని రోజులు తెలంగాణకు సేవ చేస్తా అని ట్వీట్ లో పేర్కొన్నాడు.