జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీ పై విమర్శలు చేసిన వారికి ఘాటుగానే బదులిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ పై ఎవరు విమర్శలు చేసినా స్పందిస్తూ తనదైనశైలిలో ఘాటుగా బదులిస్తూ ఉంటారు. ఇక తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు జగన్ సర్కార్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలు భూముల విషయంలో ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు మెగా బ్రదర్ నాగబాబు. తాజా పరిణామాలను చూస్తుంటే... తనకు ఎంతగానో ఆందోళన కలుగుతుందని... దీనిపై బిజెపి ఆర్ఎస్ఎస్ వీహెచ్పీ వంటి హిందూ సంస్థలు ఏదైనా చేయాలి అంటూ మెగా బ్రదర్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు. 

 

 

 మన కళ్లముందే మన దేవాలయాలకు సంబంధించిన వేల ఎకరాల భూములు ఉంటాయా లేక మాయం అవుతాయ అనే విషయం అర్థం కావడం లేదు... ఈ మత మాఫియా ప్లాన్స్ అర్థం కావడం లేదు అంటూ మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దేవాలయాల వేలాది ఎకరాల భూములు విషయంలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. బిజెపి,  ఆర్ఎస్ఎస్,  వీహెచ్పీ లాంటి హిందూ సంస్థలు... ఇలాంటి ఈ విషయంలో ఏదైనా చేయండి అంటూ డిమాండ్ చేశారు మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబు. నాలాంటి నాస్తిక హిందువుల సపోర్టు కూడా ఉంటుంది అంటూ ఈ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 

 

 

 కాగా ప్రస్తుతం నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అంటే పరోక్షంగా ప్రభుత్వం దేవాలయాల భూములను స్వాహా చేస్తుందని ఇండైరెక్టుగా మెగాబ్రదర్ జనసేన నేత నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో  తెలిపినట్లు పలువురు భావిస్తున్నారు. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గత కొంత కాలం నుంచి మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడితూ  తెర మీదికి వచ్చి హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. గతంలో కరోనా వైరస్ కు సంబంధించి కూడా నాగబాబు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: