మానవత్వం అనే మాట ఈ మనుషులు మర్చిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడు మనుషుల మధ్య బండలను పూర్తిగా మర్చిపోయారు కూడా. ఎలా అంటే వావి వరుసలు లేకుండా  కామందుల్లాగా రెచ్చిపోతున్నారు.కన్న తండ్రి తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలపై రాబందువులాగా రెచ్చిపోతున్నాడు.. విచక్షణను పూర్తిగా వదిలేసి కామ వాంఛను తీర్చుకుంటున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం కదిలించి వేస్తుంది.

 

 

 

వివరాల్లోకి వెళితే.. కవల పిల్లలను కన్నతండ్రే కామంతో కాటేసిన దారుణ సంఘటన తెలంగాణలో వెలుగుచూసింది. అదే దారుణమనుకునేలోపే మరో అమానుష ఘటన కలచివేస్తోంది. ఆ బాలికలపై మేనమామ మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. బాలికల పరిస్థితి విని చలించిపోయిన టీచర్లు ఆ మానవ మృగాల ఆటకట్టించారు.                             

 

 


వరంగల్లో కాశీబుగ్గ శ్రీనివాస కాలనీ కి చెందిన దంపతులకు 14 ఏళ్ల వయసున్న కవలలైన కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. అక్కాచెల్లెళ్లు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. తండ్రి, మేనమామ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే రాబందువు తన గుడ్లను తానె తాగేసినట్లు తండ్రి మామ , ఇద్దరు కామ వంచనను తీర్చుకున్నాడు. 

 

 


ఒకరికి తెలియకుండా మరొకరు ఇద్దరిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. మేనమామ మూడేళ్లుగా అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడు. ఏడాది కాలంగా కన్నతండ్రి కూడా అమానుషంగా బాలికలపై అత్యాచారం చేస్తున్నాడు. ఇద్దరు దాడిని భరించలేక తమ గోడును స్కూల్ టీచర్లకు చెప్పుకున్నారు. చలించిపోయిన ఉపాధ్యాయులు వెంటనే వరంగల్ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కవలలపై అత్యాచారానికి పాల్పడుతున్న కన్నతండ్రి, మేనమామను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: