ఈ మధ్య కాలంలో మహిళలపై రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. మహిళలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కామందుల కోరల్లో చిక్కుకోక తప్పడం లేదు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ అత్యాచారాలు చేసే వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో  మాత్రం మార్పు రావడంలేదు. కామందులను ఎన్కౌంటర్లు చేసి చంపిన ఎక్కడ భయం మాత్రం కనిపించడం లేదు. కామంతో ఊగిపోతున్న మృగాళ్లు... ఆడపిల్ల కనిపిస్తే చాలు అత్యాచారానికి పాల్పడుతున్నారు. దీంతో నేటి సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇంటి నుంచి కాలు బయట పెట్టిన ఆడపిల్ల మళ్లీ ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుందా లేదా అన్నది కూడా గ్యారెంటీ లేని పరిస్థితుల్లో  నేటి సమాజం బతుకుతుంది. 

 

 

 కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారాలు చేయడం ఆ తర్వాత అతి దారుణంగా హత్య చేయడం లాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. పండు ముసలి నుంచి పాలు తాగే చిన్నపిల్లల వరకూ ఎవరినీ వదిలిపెట్టడం లేదు కామాంధులు. అందరూ కామాంధుల కోరల్లో చిక్కుకొని బలైపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరగ్గా  తాజాగా ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి దారిలోనే ఆ  మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇక అత్యాచారానికి గురైన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

 

 

 చందన పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ పొరుగూరు కు వెళ్లి తిరిగి వస్తూ దారిలో ఆటో కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అటువైపుగా వచ్చినా అదే గ్రామానికి చెందిన ప్రవీణ్  అనే వ్యక్తి... ఆమె అక్కడ ఆటో కోసం ఎదురు చూస్తూ ఉండటం చూసి కారు ఆపాడు. ఊర్లో దింపు తాను అంటూ నమ్మబలికి ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. ఇక కారు బయలుదేరిన తర్వాత కొంతదూరం వెళ్లగానే దారి మళ్లించి కారులో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇక ఆ కామాంధుడి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న  బాధిత మహిళ... షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: