దళిత యువకుడైన ప్రణయ్ తన కూతురు ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని అతి దారుణంగా అతనిని చంపించిన మారుతీ రావు నిన్న వైశ్య భవనం లో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు దీన్ని ఆత్మహత్యగా పరిగణిస్తూ ఎక్కడైనా హత్య జరిగిందా అన్న ఆధారాలు బయటపడతాయేమో అని వెతుకుతున్నారు. అయితే ఇతని మరణం వెనుక అసలు స్టోరీ చాలానే ఉంది. అని ఇప్పుడిప్పుడే బయటికి వస్తోంది.

 

విషయం ఏమిటంటే కూతురు తన పరువు తీసింది అని కోపంతో రగిలిపోయిన అప్పటి మారుతీ రావు వేరు ఇప్పుడు శవంలా పడి ఉన్న మారుతీరావు వేరు. అయితే కులపిచ్చితో సొంత అల్లుడిని చంపిన ఆ మారుతీ రావు ఇప్పుడు తీవ్రమైన శోకం మరియు పశ్చాతాపం రూపంలో ఈ మారుతీరావు ని బలి తీసుకున్నాడు. మన దేశంలో ఆత్మహత్య నేరం తో సమానం కాబట్టి మారుతీరావు తనను తానే హత్య చేసుకున్న నేరస్థుడిగా మిగిలిపోయాడు.

 

IHG

 

అతనిది ఆత్మహత్య అని అంతా ఇంత కచ్చితంగా ఉన్నందుకు కారణం ఏమంటే... అతనికి కాల్ రికార్డ్స్ ను బయటకు తీయగా అతని మరణానికి కొద్ది రోజుల ముందు తన కూతురు అమృత తో ఫోన్లో మాట్లాడినట్టు తేలిందట. ఇంకా మరి కొంచెం లోతుగా విచారిస్తే అమృతను తిరిగి తన దగ్గరికి వచ్చేయమని మారుతీరావు కోరగా ఆమె అందుకు ససేమిరా నిరాకరించడంతో ఒంటరిగా ఫీల్ అయిన మారుతిరావు చివరికి తనను తానే చంపుకున్నాడు.

 

IHG

 

అతని ఆస్తి పంపకాలలో కూడా ఒక భాగం మాత్రం భార్య పేరు మీద రాయగా మరొక భాగం తను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం గా ట్రస్ట్ పేరు మీద రాశాడు. ఇక చివరి భాగం అతని తమ్ముడి కొడుకుల పేర్ల మీద రాసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా అప్పుడు ప్రణయ్ ని హత్య చేసిన మారుతీ రావు చివరికి తనని తాను హత్య చేసుకున్న విషయం ఈ కాల్ రికార్డ్స్ ద్వారా బయట పడిందన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: