ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో మూలవిరాట్టును సోమవారం ఉదయం సూర్యకిరణాలు స్పర్శించాయి. ఆదిత్యుని పాదాలను స్పృశించేందుకు భానుడు చేసిన ప్రయత్నానికి వాతావరణం తోడందించింది. ఆకాశంలో మేఘాలు తొలుత అడ్డుపడినా, క్షణాల వ్యవధిలోనే ముబ్బులు తొలగి స్వామివారి ముఖాన్ని కిరణాలు స్పర్శించడంతో భక్తులందరూ తన్మయత్వం చెందారు. 

 

IHG

మొదటగా స్వామివారి పాదాలను స్పృశించిన కిరణాలు, అక్కడ నుంచి ముఖం వరకు వచ్చి సుమారు ఆరు నిమిషాల పాటు భక్తులకి కనువిందు చేశారు. సూర్యకిరణాలు స్వామివారి పాదాల నుంచి ముఖం ఉత్తరాయణం నుంచి దక్షిణాయణానికి సూర్యుడు గమనం మార్చుకునే సందర్భంలో కిరణ స్పర్శ మూలవిరాట్టును తాకడం ఈ ఆలయ యొక్క ప్రత్యేకత అని అందరికి తెలిసిన విషయమే.

 

IHG


సూర్యని యొక్క కిరణాలు స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా ఇక్కడ భక్తులకి కనువిందు చేస్తోంది. ఇక్కడ సంవత్సరంలో కేవలం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మాత్రమే ఈ దృశ్యం కనిపిస్తుంది. ఈ దైవత్వ దృశ్యాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఉత్తరాయణంలో మార్చి 9, 10 తేదీలు, అలాగే దక్షిణాయనంలో అక్టోబరు 1, 2 తేదీల్లోనూ సూర్యకిరణాలు మూలవిరాట్టును స్పర్శిస్తాయి. సోమవారం ఈ దృశ్యాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కనులారా వాటిని వీక్షించారు.

 

IHG

ఈ సూర్యకిరణాలు ఆలయంలోని సూర్యభగవానుడిని విగ్రహాన్ని తాకే సమయంలో స్వామివారిని దర్శించుకుంటే విజయం తథ్యమని భక్తుల అపార నమ్మకం. ఉదయం వచ్చే కిరణాలు స్పృశించిన సూర్యనారాయణుడిని దర్శించుకుంటే అన్ని రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు బాగా నమ్ముతారు. మన దేశంలో అన్ని సూర్య ఆలయాలలతో పోలిస్తే సూర్యదేవాలయాలలో ఈ గుడే అత్యంత ప్రాచీనమైనది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కస్యప మహర్షి ఈ దేవాలయం యెక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. సాక్షాత్తు ఇంద్రుడే ఈ ఆలయాన్ని నిర్మించాడని పూర్తి అధరాలు మంకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: