కొన్నాళ్ల క్రితం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ప్రణయ్ పరువు హత్య ఉదంతం మనకు అందరికీ తెలిసిందే. తన కూతురు అమృత తక్కువ కులం వ్యక్తయిన ప్రణయ్ ని వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఆమె తండ్రి మారుతీ రావు అతడిని, మరొక వ్యక్తికి సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. ఇక ఆ హత్యోదంతం ఎంతో సంచనలనం రేపడం, ఆ తరువాత పోలీసులు మారుతీ రావుని అరెస్ట్ చేయడం జరిగింది. కాగా ఈ ఘటనలో తన కన్నతండ్రే తన భర్తను హత్య చేయించడం దారుణం అని, ఆయనను కఠినంగా శిక్షించాలని అప్పట్లో అమృత కోరింది. ఆ తరువాత కోర్టు మారుతిరావుకు శిక్ష విధించింది. అయితే ఇటీవల బెయిలు పై బయటకు వచ్చిన మారుతీ రావు, ఎంతో ఆవేదనతో జీవిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

ఇక నిన్న హఠాత్తుగా హైదరాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో మారుతీ రావు ఆత్మ హత్య చేసుకున్నాడు. ఓ ప్రక్కన కూతురు తనకు శిక్ష వేయించడంతో పాటు కుటంబం అంతా చిన్నాభిన్నం అవడంతో ఎంతో ఆవేదన చెందిన అతడు, గారెల్లో విషం కలుపుకుని తిన్నట్లు సమాచారం. అయితే మరణించిన తండ్రి భౌతికకాయానికి నేడు నివాళులు అర్పించడానికి వెళ్లిన అమృతకు కడసారి చూపు చూపు కూడా దక్కలేదు. దానితో అమృత వెనుతిరిగి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఓవైపు కట్టుకున్న భర్త, మరోవైపు కన్నతండ్రి ఇద్దరూ కూడా చనిపోవడంతో ప్రస్తుతం అమృత పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. అయితే నేడు ఆమె పరిస్థితిపై నటి శ్రీరెడ్డి తన సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా స్పందించింది. 

 

అమృత పరిస్థితి చూస్తుంటే నిజంగా నాకు ఎంతో ఆవేదనగా ఉంది. భర్త తో పాటు తండ్రికి కూడా దూరమైన ఆమెకు భగవంతుడు గుండె ధైర్యాన్ని ప్రసాదించాలని, అలానే ఆమెకు, ఆమె బిడ్డకు ఎప్పుడూ ఆ భగవంతుడి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు శ్రీరెడ్డి ఒక పోస్ట్ పెట్టింది. కాగా ఆమె పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: