ఈ మధ్య కాలంలో మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. సొంత వాళ్లనే కడతీర్చేందుకు వెనకాడటం లేదు. చిన్న చిన్న గొడవలు వివాదాల కారణంగా ఏకంగా సాటి మనుషుల ప్రాణాలనే మానవత్వం మరిచి గాల్లో కల్పిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నాయి. మనుషులు రోజు రోజుకి మానవత్వం మంటగలిసి పోతుంది. రోజురోజుకు మృగంగా మారిపోతున్నాడు మనిషి. ఇక్కడ ఓ వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆస్తి విషయంలో చెలరేగిన వివాదాలు ఏకంగా హత్యకు దారితీసేంత వరకు వెళ్లాయి . దీంతో వివాదం కారణంగా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గంగన్న పేట లో రెండు రోజుల క్రితం రిటైర్డ్ ఏఎస్ఐ తాళ్లపల్లి శివరాజ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు కారణం భూవివాదాలు అని నిర్ధారణ అయ్యింది. శివరాజ్ హత్య వెనుక తమ్ముడు జయరాం తో నెలకొన్న ఆస్తి తగాదాలే అసలు కారణమని తెలుస్తోంది. జయ రాజు కొడుకు పెదనాన్న శివరాజ్ ని అతి దారుణంగా హత్య చేశాడు. అయితే ఏఎస్ఐ గా పనిచేసి రిటైరయిన శివరాజ్ కుటుంబానికి తమ్ముడు జయరాజ్ ఫ్యామిలీతో ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే జయరాజ్, వివేక్ అన్న శివరాజ్ అడ్డగించి కర్రతో కొట్టి చంపేశారు. అంతటితో ఆ గారు అనుకుంటున్నారా... పెదనాన్న శవంతో సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు వివేక్ .
ఇక భర్త మరణవార్త తెలుసుకున్న శివరాజు భార్య కన్నీరుమున్నీరైంది. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఇక మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... జయరాజ్ కొడుకు వివేక్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక వివేక్ పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. భూ తగాదాల విషయంలో ఏకంగా సొంత పెదనాన్న ని అతి దారుణంగా చంపేసి... ఆపై ఓ వీడియోను కూడా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పై గ్రామస్తులు బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనిషిలో మానవత్వం కరువై... ప్రేమ ఆప్యాయత ఉండాల్సిన అనుబంధాలు మాయమైపోతున్నాయి అని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.