ఆమె ప్రేమ ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. అటు భర్తను ఇటు తండ్రిని కోల్పోయింది. మిర్యాలగూడ కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆదివారం అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆర్యవైభ్య భవన్‌లో అతడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అంతేకాదు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభించింది. దింతో మారుతీరావు మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

 

తాజాగా తండ్రి ఆస్తి కోసమే అమృత ఇప్పడు డ్రామాలు ఆడుతుందని ఆమె బాబాయ్ శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు కోసమే తనపై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. నిన్నటి వరకు తండ్రి చనిపోవాలని కోరుకున్న అమృతకు సడెన్‌ గా ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందన్నారు. తల్లిపై నిజంగానే ప్రేమ ఉంటే నిన్నటి నుంచి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 

 

తన వల్ల ఆమెకు ప్రాణహాని ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు ఆమె బాబాయ్. వాళ్ల అమ్మ వద్దకు అమృత వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. అమృత చేసిన చెత్త పనికే ఇవన్నీ జరిగాయని ఆయన మండిపడ్డారు. మారుతీరావు ఆస్తిలో తనకు ఒక్క పైసా అవసరం లేదన్నారు. తన సంపాదన తనకు బాగానే ఉందని ఆయన అన్నారు.


మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అమృత వాపోయారు. మారుతీరావు, ఆయన తమ్ముడు శ్రవణ్‌ కీ మధ్య ఆస్తి గొడవలున్నాయన్నారు. మారుతీరావు ఒత్తిడి వల్ల చనిపోయాడని అనుకోవట్లేదన్న అమృత తెలిపారు. ఆయన చనిపోవడంపై శ్రవణ్‌ కి ఏమాత్రం బాధ లేదంటూ..  బాబాయ్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది అమృత. వీలునామాలో శ్రవణ్ పేరు ఉంటే... అనుమానాలు వస్తాయన్న ఉద్దేశంతోనే... ఆయన తన పేరును తీయించేసి ఉంటారని ఆమె అభిప్రాయపడింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: