గతకొద్దీ రోజుల క్రితం హైదరాబాద్ లో కరోనా కలకలం రేపింది. దింతో సాఫ్ట్ వేర్ కంపెనీలకు వారంరోజులు వర్క్ ఫ్రొమ్ హోమ్ ఇచ్చి కంపెనీకి సెలవులు ఇచ్చారు. తాజాగా దేశంలో మరో రెండు కరోనా కేసులు నమోదైయ్యాయి. ఐటీ సేవలకు కేంద్రమైన బెంగళూరు నగరంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. 


బెంగళూరులో 40 ఏళ్ల ఓ సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ కరోనా కారణంగా రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్‌లో అడ్మిట్ అయ్యారు. ఆయన భార్య పిల్లలు కూడా అడ్మిట్ అయ్యారని తెలుస్తోంది. ఆయన అమెరికా వెళ్లి వచ్చారని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధీర్ తెలిపారు. కరోనా వైరస్ భయాందోళనల కారణంగా కర్ణాటకలో అంగన్‌వాడీ కేంద్రాలకు వారం రోజులపాటు సెలవులు ప్రకటించారు. ప్రైమరీ స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు.

 

ఇది ఇలా ఉంటే మరో వైపు పంజాబ్‌లోనూ తొలి కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి తిరిగొచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో భారత్‌లో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 45కు చేరింది. తమిళనాడులో ఒకరికి కరోనా సోకగా.. ఆయన భార్యకు నెగటివ్ అని రిపోర్ట్ వచ్చినట్లు సీఎం పళని స్వామి ప్రకటించారు.

 

కోవిడ్ కారణంగా మార్చి 17 వరకు దోహాకు విమాన సర్వీసులు నిలిపేయాలని ఇండిగో నిర్ణయించింది. కరోనా వైరస్ భయాందోళనల కారణంగా సోమవారం ఒక్కరోజే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్ల మేర తగ్గిపోయింది.

 

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3800 మందికిపైగా మరణించగా.. కోవిడ్ బాధితుల సంఖ్య 1.10 లక్షలకు చేరింది. మొత్తం 100 దేశాలకు కరోనా విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ కారణంగా చైనాలో 3120 మంది చనిపోగా.. చైనా వెలుపల 764 మంది ప్రాణాలు వదిలారు. ఇటలీలో అత్యధికంగా 366 మంది కరోనాకు బలవగా.. ఇరాన్‌లో 237 మంది చనిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: