తరాలు మారిన, మనిషి ఆలోచనలు మూఢ నమ్మకాల చుట్టే తిరుగుతున్నాయనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన.. మార్పు లోకంలో వస్తుంది కాని మనిషిలో మాత్రం నశిస్తుంది.. కొందరైతే వింతగా ఆలోచిస్తారు.. అనారోగ్యం వచ్చి ఒక మనిషి మరణిస్తే.. చేతబడి అంటారు.. లేదా ఇంకేదో అనుమానాన్ని వెలిబుచ్చుతారు.. ఇదిగో ఇలాంటి దారుణమే ఒకటి జరిగింది.. ఒక వ్యక్తి అత్యంత కిరాతంగా చంపబడితే, అతన్ని ఆత్మ చంపిందని స్దానికులు అంటున్నారు..

 

 

ఇందులో ఉన్న నిజం ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ ఆ విషయన్ని వదిలి అసలు ఏం జరిగిందనే మ్యాటర్లోకి వెళ్లుదాం.. మహారాష్ట్రలోని, ఠానే జిల్లాలో ఉన్న నార్పోలీ అనే ప్రాంతంలో భివండి టౌన్ షిప్‌లో ఓ వ్యక్తిని అత్యంత దారుణ రీతిలో గొంతును రెండుగా చీల్చి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.. ఈ ప్రాంతంలో నివసించే తులసీరామ్ చవాన్ అనే 31 ఏళ్ల వ్యక్తి తన సోదరునితో కలిసి తల్లిదండ్రులు చనిపోయిన నాటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇతని సోదరుడు కూడా గత ఫిబ్రవరి 2న చనిపోయాడు.. అప్పటికే ఇతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ దశలో తన సోదరుని మరణం ఇంకా కృంగదీసింది.. ఇలాంటి దారుణ పరిస్దితుల్లో  తులసీరామ్ చవాన్ పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.

 

 

ఇదిలా ఉండగా, హత్య కావడానికి ముందు రోజు  ఇంట్లో తాను ఒంటరిగా ఉన్నా తన సోదరుడు, తనతోనే ఉన్నట్లుగా ఉంటోందని, ఓ పొరుగు మహిళతో చెప్పాడట. దీంతో ఆ మహిళ అతని పై జాలి పడి తన ఇంట్లోనే పడుకోమని చెప్పింది. అలాగే పడుకున్న తులసీరామ్ చవాన్ తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లి మళ్లీ రాలేదట.. ఏమైపోయాడ అని చూసేసరికి ఆ ఇంటికి దగ్గర్లోనే ఉదయం 7.30 గంటల ప్రాంతంలో తులసీరామ్ చవాన్ శవమై కనిపించాడట.

 

 

అతని మరణం చూడడానికి అతిభయంకరంగా ఉందట.. ఇక స్దానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసుకున్న వారు దర్యాప్తూ చేయగా, ఇతని హత్యకు గల కారణాలేంటో కచ్చితంగా తెలియరాలేదు. కానీ స్థానికులు మాత్రం చనిపోయిన అతని సోదరుడే ఆత్మ రూపంలో ఇంత దారుణానికి పాల్పడ్డాడని అంటున్నారు.. కాగా నిజనిజాలు త్వరలోనే తేలుస్తామని పోలీసులు వెల్లడించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: