ప్రముఖ సీనియర్ సినీ నటుడు మరియు హిందూపురం నియోజకవర్గపు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. మామూలుగా బాలకృష్ణ తరచుగా రాజకీయపరంగా కామెంట్లు చేసే వ్యక్తి కాదు. తన సినిమాలు తను చేసుకుంటూ తన నియోజకవర్గానికి అప్పుడప్పుడు విచ్చేస్తూ ఉంటాడు. రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్దగా తల దూర్చడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వియ్యంకుడు. అయితే ప్రస్తుతం హిందూపురం లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు లీడర్ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు బాలయ్య గుండెల్లో గుబులు రేపుతోంది.

 

వివరాల్లోకి వెళితే ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మరియు నవీన్ నిశ్చల్ హిందూపురం నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఇక్బాల్ నవీన్ నిశ్చల్ పై ఎన్నికల సమయంలో బాలకృష్ణతో కుమ్మక్కై పనిచేశాడని.... అతను పార్టీకి ద్రోహం చేశాడని ఆరోపించారు. నిశ్చల్ మాత్రం అతని పై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశాడు. ఇలా బహిరంగంగానే ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటున్నారు. అంతేకాకుండా పబ్లిక్ లో ఎవరికి వారు తమ తమ ఫ్లెక్సీలు వేసుకొని నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా తమని తాము ప్రచారం చేసుకుంటున్నారు.

 

సరే అంతటితో ఆగకుండా ఇప్పుడు వారు ఇద్దరూ కలిసి బాలయ్య ను టార్గెట్ చేస్తున్నారు గతంలో హిందూపురంలో కి వచ్చిన బాలయ్యను కొంతమంది వైసీపీ కార్యకర్తలు రాజధాని విషయమై టీడిపి ఎందుకు అడ్డుపడుతుందని…. రాయలసీమ ద్రోహి అని అతనిని అడ్డుకున్న విషయం తెలిసిందే. సారి కూడా బాలయ్య త్వరలో వస్తున్నట్లు సమాచారం రావడంతో అతని కాన్వాయ్ ను అడ్డుకుని ఇద్దరూ ఎవరికి వారు తమ మైలేజీని నియోజకవర్గంలో పెంచుకునేందుకు మరియు హైకమాండ్ ను ప్రసన్నం చేసుకునేందుకు చూస్తున్నారట. వీరిద్దరి పోరు తన చావుకి వచ్చిందంటూ బాలయ్య ఇప్పుడు హిందూపురం వెళ్ళాలంటేనే హడలిపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: