సాధారణంగా ఎవరికైనా అందమైన భార్య ఉండాలని.. పదిమందిలో తమ జంట నడుస్తూ వెళ్తే అబ్బో భలే జంట అనుకోవాలని అనుకుంటారు.   ప్రతి పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు తమకు కాబోయే వారు అందంగా ఉండాలని చూస్తుంటారు.  మరికొంత మంది కమర్షియల్ గా ఆలోచించే వారు కూడా ఉన్నారు.  తాజాగా ఓ అమ్మాయి చాలా అందంగా ఉందని ఆ అమ్మాయి ని మిస్ అయితే మళ్లీ దొరకదని ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుని ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. పెళ్లైన కొన్ని రోజుల వరకు ఎంతో అనుకువగా.. ప్రేమను పంచుతూ భర్త ఆహా ఏమి నా భాగ్యం.. అందమైన పెళ్లాం.. అనుకువగల భార్య అంటూ సంతోషంలో మునిగిపోయాడు. 

 

కానీ మూడు నెలల్లో కళ్లు బైర్లు కమ్మే సంఘటనతో భర్త ఇప్పుడు లబో దిబో అంటున్నాడు. పెళ్లయిన మూడ్నెల్లకే ఆ మగువ విశ్వరూపం చూపించింది. ఇంట్లో ఉన్న నగానట్రాతో ఉడాయించింది. మధ్యప్రదేశ్ లో జరిగిందీ ఘటన.  వివరాల్లోకి వెళితే.. ఉదయ్ పూర్ జిల్లాలోని గుడ్లీ గ్రామానికి చెందిన ముఖేశ్ సేథియా ఇండోర్ అమ్మాయి స్వప్నను పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన నాటి నుంచి స్వప్నతో ప్రేమగా వ్యవహరించాడు. అయితే ఆమె అందానికి ముగ్దుడైన ముఖేశ్ ఆమె ఏం చేసిన పెద్దగా పట్టించుకునేవాడు కాదు. పెళ్లయిన కొన్నివారాల తర్వాత ఉన్నట్టుండి స్వప్న మాయమైంది.

 

ఇంట్లో ఉన్న నగలు, డబ్బు కూడా కనిపించకపోవడంతో హడలిపోయిన ముఖేశ్ చాలా చోట్ల గాలించినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లికూతురు స్వప్న గురించి దిమ్మతిరిగిపోయే విషయంలు తెలుసుకున్నారు.  సంపన్నుల వర్గంలో ఉన్న యువకులకు ఉచ్చు వేసి వారిని పెళ్లి చేసుకొని కొంత కాలం తర్వాత డబ్బు, నగలతో ఉడాయిస్తుంటారని.. ఇలా వీరొక ముఠాగా ఏర్పడ్డారని అన్నారు. స్వప్న బారినపడింది ముఖేశ్ ఒక్కడే కాదట... ముఖేశ్ కంటే ముందు అనేకమందిని ముంచిన ఘనురాలు స్వప్న అని పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: