ప్రతీ సారి ఏదో ఒక కొత్త ప్రణాళికతో వస్తుంది మోదీ సర్కార్. అయితే మొదట స్వచ్ఛత కోసం స్వచ్ఛ్ భారత్ వచ్చింది. ఆ తర్వాత ఇలా అనేక కొత్త కొత్త వాటిని మోదీ నిర్వహించడంలో మొదట ఉంటాడు. అయితే తాజాగా మరో విషయం పై మోదీ చెబుతూ స్పందించాడు. దానిని ఫాలో అవ్వమని అవార్డు కూడా ఇస్తామన్నట్టు తాజాగా తెలియనుంది.

 

 

ప్రధాని మోదీ క్విజ్ గురించి అనేక విధాలుగా చెప్పారు. అందరికీ ఈ సంగతి తెలిసేటట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే మోదీ చెప్పిన దానిలో మరి పద్మ క్విజ్ గెలిస్తే పద్మ అవార్డు ఇస్తారా అన్నది ప్రశ్న అయ్యిపోయింది. అయితే ట్యాలంట్ ని బట్టి అవార్డు గెలుచుకోవడం తెలిసినదే. కానీ క్విజ్ గెలిస్తే అవార్డా అని షాక్ అవుతున్నారు జనం. ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాని వేదిక చేసి సోమవారం క్విజ్ పోటిలని నిర్వహించారు. దీనిలో ఎంతో మంది లాగిన్ అయ్యి పాల్గొన్నారు. అయితే ఈ క్విజ్ లో పాల్గొన్న వారికి మోది అవార్డుని ప్రధానం చేస్తారన్న సంగతి అందరికీ తెలిసినదే. 

 

 

చక్కగా సమాధనాలతో సరిగ్గా జవాబులు పెట్టిన వారు ఈ నెల 20న  రాష్ట్రపతి భవన్‌ లో జరగబోయే ఆ వేడుకలో పాల్గొనటుకు అవకాశం ఉంది అని మోదీ చెప్పారు. ఈ ప్రోగ్రాం దేశంలో నిర్వహించే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన అత్యధిక విలువైన పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యే అవకాశం. సమాధానాలు ఎక్కువగా చెప్పి అత్యధికంగా స్కోర్ చేసిన వారికి కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ క్విజ్‌ పోటీలో పార్టిస్పేట్ చేసి వారికి బాగా అధిక మార్కులు సాధించినట్లు అయితే ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని వారు వినియోగించుకోవచ్చు అని సోషల్‌ మీడియా ఫలోవర్స్ తో మోదీ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: