ప్రేమ అంటే ఎన్నో మధుర జ్ఞాపకాలకు చిరునామా. రెండు మనసుల కలయిక. కానీ నేటి తరంలో ప్రేమ అంటే రెండు మనసులు కాదు రెండు శరీరాల కలయిక అన్నట్లుగా మారిపోయింది అవసరాల కోసం  ప్రేమ పేరును వాడుకుంటున్నారు. ఇక ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని పూర్తిగా నడిరోడ్డు మీద వదిలేస్తున్నారు. దీంతో సదరు యువతి తన జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో చాలానే తెరమీదకు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. పెళ్లి చేసుకుంటానని ఆ మహిళకు మాయమాటలు చెప్పాడు... 19 ఏళ్ల పాటు లైంగికంగా కామవాంఛ తీర్చుకున్నాడు... ఇక మోజు తీరాక ఆ యువతికి తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తాను మోసపోయాననే  విషయాన్ని గ్రహించిన యువతి చివరికి పోలీసులను ఆశ్రయించింది. 

 

 వివరాల్లోకి వెళితే.. చెన్నైలో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజినీర్గా పని చేస్తుంది ఓ మహిళ. ఇక 19 ఏళ్ల క్రితం కానూరులో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఆ యువతి బీటెక్ చదువుతున్న సమయంలో అక్కడే ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని ఆమెకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారి పోయింది. ఈ క్రమంలోనే ఆ యువతిని శారీరకంగా యూస్ చేసుకోవాలనుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. ఎన్నో ఏళ్ల పాటు లైంగిక కోరిక తీర్చుకున్నాడు. ఇక ఇంజనీరింగ్ పూర్తవగానే సదరు యువతికి చెన్నై లో ఉద్యోగం రావడంతో ఆమె అక్కడికి వెళ్లి పోయింది. అయినప్పటికీ వదలని నీచుడు... చెన్నై కి వెళ్లి మరి ఆమె తో రాసలీలలు కొనసాగించేవాడు. పెళ్లి విషయం ఎత్తితే మాత్రం ఏదో దుందుడుకు సమాధానాలు చెప్పి తప్పించుకునే వాడు. 

 


 ఇక 19 ఏళ్ల పాటు ఇలాగే ఆ యువతిని లైంగికంగా వాడుకున్నాడు.. ఇక ఆ తర్వాత మోజు తీరాక ఆ యువతికి తెలియకుండా మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు ఆ వ్యక్తి. ఇక ఈ విషయాన్ని ఇటీవలే తెలుసుకున్న బాధితురాలు షాక్కి గురైంది. దీంతో ధైర్యం తెచ్చుకుని శ్రీరామచంద్ర మూర్తి తో పాటు అతని తల్లిదండ్రులను కూడా నిలదీసింది. దీంతో శ్రీరామచంద్రమూర్తి సదరు బాధితురాలిని కులం పేరుతో దూషించాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తీవ్ర మనస్థాపానికి గురైన బాధితురాలు... పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో శ్రీరామచంద్రమూర్తి తో పాటు అతని తల్లిదండ్రుల పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: