మాములు గా  మందు ప్రియులు మద్యాన్ని అతిగా సేవిస్తే.. చేసే పని తూలుతూ పది మందిని తిట్టడం.. అలాంటిది ఓ తాగుబోతు ఫుల్లు బుడ్డీ తాగి మనిషి మాంసంతో కూర వన్డే ప్రయత్నాన్ని చేసాడు. ఏంటి నమ్మలేకున్నారా నిజమే అండీ..  ఓ తాగుబోతు భార్యకు సర్ఫరైజ్ ఇవ్వాలని ఉద్దేశ్యంతో మాంసం వండాలని అనుకున్న అతను మనిషి చెయ్యితో వంటను చేయబోయాడు.. దేవుడా నీలాంటి వాడు ఎక్కడ కనపడడేమో.. 

 

 

 

ప్రపంచంలోని కొన్ని అటవిక జాతుల ప్రజలు నరమాంస భక్షకులని విన్నాం. కానీ ఉత్తరప్రదేశ్ కు చెందిన సంజయ్ అనే తాగుబోతు మద్యం మత్తులో నరమాంసంతో కూర వండేందుకు ప్రయత్నించడం చుట్టూ ప్రక్కల వాళ్ళను భయ భ్రాంతులకు గురిచేస్తుంది. .అసలు విషయానికొస్తే.. బిజ్నూర్ జిల్లాకు టిక్కోపూర్ కు చెందిన 32 ఏళ్ల సంజయ్ మద్యానికి బానిసై కుటుంబసభ్యులను వేధిస్తుండేవాడు. 

 

 

 

తాగితే అతడి చేష్టలకు అంతూ పొంతూ ఉండేది కాదు. ఎప్పట్లాగే సోమవారం రాత్రి బాగా మద్యం సేవించిన సంజయ్ కి వింత కోరిక కలిగింది. దాంతో శ్మశానికి వెళ్లి అక్కడ ఓ మృతదేహం చేయిని తీసుకువచ్చి కూర చేసేందుకు ప్రయత్నించాడు. మత్తులో చేసారని అనుకున్నారు. ఇంటికి వచ్చిన భార్య కిచెన్ లో జరుగుతున్న తతంగం చూసి హడలిపోయింది. 

 

 

ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. మద్యం నిషాలో ఉన్న సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంజయ్ వింత పనులు చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ ఇలాగే విచిత్రంగా ప్రవర్తించేవాడని స్థానికులు చెబుతున్నారు.అతనికి తాగితే తల్లి పెళ్ళాం అనే విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోతున్నారని సదరు అభిప్రాయపడుతున్నారు. కాగా, అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: