అమ్మ.. నవ మాసాలు మోసి కానీ పెంచిన అమ్మ.. తన రక్తమాంసాలు ధారపోసి..మన జన్మకోసం పునర్జన్మ ఎత్తిన ఆమె కనిపించే దైవం అని అంటారు.. అందుకే అడక్కుండానే అన్నం పెట్టె దైవం అందుకే.. అమ్మ ను కంటికి రెప్పలా చూసుకోవాలని చూస్తున్నారు. ఇకపోతే అమ్మ పై  కన్నెర్ర చేసిన కొడుకు తల్లి అనే సంగతి కూడా మరచి కోపం తో చంపేశాడు. ప్రస్తుతం ఈ ఘటన కదిలించి వేస్తుంది. 

 

 


తను ఇష్టపడిన అమ్మాయి ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని ఏకం గా కన్నతల్లి నే కడతేర్చాడో కసాయి కొడుకు. అందుకు అతని ప్రియురాలు కూడా సహకరించింది. కోడలు కాకముందే అత్తని పరలోకాలకు పంపించింది. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో చోటుచేసుకుంది.

 

 


జగదీశ్‌పురా పరిధిలో ని వైశాలి నగర్‌కి చెందిన శివమ్ శర్మ అనే యువకుడు రాణి అనే యువతిని కొద్దికాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. అదే విషయం శివమ్ ఇంట్లో చెప్పాడు. అందుకు అతని తల్లి లక్ష్మీ దేవి నిరాకరించింది. రాణితో పెళ్లికి ససేమిరా అంది. దీంతో ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

 

 

అయితే అతను బయటకు వెళ్తే బ్రతకడానికి సొంత ఇంటికే  కర్ణంవేసాడు  వేసాడు.. ఇంట్లో ఉన్న డబ్బు, నగదు మొత్తాన్ని సర్దేసాడు. అలా వెళ్తున్న క్రమంలో చూసిన తల్లి అవన్నీ మొత్తం ఇంట్లోనే పెట్టాలని తేల్చిచెప్పింది. అయితే అందుకు అతను నిరాకరించడంతో కోపంతో ఊగిపోయిన కొడుకు కొడుకు, అతని ప్రియురాలు రాణితో కలసి తల్లి ముఖంపై దిండు అడ్డుపెట్టి ఊపిరాడకుండా చేసి అమానుషంగా అమ్మను చంపేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: