కులాంతర వివాహం చేసుకుందని కూతురు భర్తను కిరాయి గుండాల చేత నరికించాడు మారుతీ రావు. మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన మారుతీ రావు తన కూతురు అమృత దళితుడైన ప్రణయ్ నీ ప్రేమించి పెళ్లి చేసుకుందని అహంతో కూతురు భర్త ప్రణయ్ నీ అడ్డంగా కూతురు కళ్ళముందే నరికి చంపించాడు. 2018వ సంవత్సరంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో జైలుకు వెళ్లిన మారుతీరావు దాదాపు ఏడు నెలల తర్వాత బెయిల్ పై బయటకు రావడం జరిగింది. అయితే ఇటీవల హైదరాబాద్ నగరంలో ఆర్య వైశ్య భవన్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. దీంతో మారుతీరావు మరణించడంతో ఆయన ఆస్తులపై రకరకాల వార్తలు వస్తున్నాయి.

 

మిర్యాలగూడ ప్రాంతంలో కిరోసిన్ వ్యాపారం తో స్టార్ట్ అయిన మారుతీరావు జీవితం అంచెలంచెలుగా ఎదిగి రైస్ మిల్లర్ గా ఆ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారినట్లు తెలుస్తుంది. దాదాపు 200 కోట్లకు పైగానే ఆస్తులను మారుతీరావు కూడబెట్టుకున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. కూతురు అమృతాన్ని చాలా గారాబంగా ఏది అడిగినా క్షణాల్లో తెచ్చి ఇచ్చే తండ్రిగా మారుతీ రావు చూసుకోవడం జరిగింది. అటువంటి కూతురు కులం తక్కువ వాడు అయినా దళితుడైన ప్రణయిని ప్రేమించడం తో పాటు పెళ్లి చేసుకోవడం తట్టుకోలేకపోయిన మారుతీ రావు ప్రణయిని దారుణంగా చంపించడం జరిగింది.

 

అయితే ఈ కేసులో జైలుకు వెళ్లడంతో చార్జిషీట్ అవుతున్న తరుణంలో శిక్ష తప్పదని తెలుసుకోవటం తోపాటుగా కన్నకూతురు తాను ప్రేమించిన భర్తని చంపిన తన తండ్రిని...చట్టపరంగా ఉరిశిక్ష వేసి చంపేయాలి అంటూ మాట్లాడటంతో మారుతీరావు తట్టుకోలేక...తన ఆస్తిని తన తమ్ముడు శ్రావణ్ భార్య గిరిజ పేరుమీద సగం ఆస్తి రాసి సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగినది. అయితే ఇదే తరుణంలో కొంత ఆస్తిని ఏదో ట్రస్ట్ కి మారుతీ వ్రాసినట్లు ఆస్తి విషయంలో ఇదే పెద్ద షాకింగ్ ట్విస్ట్ అన్నట్లు సరికొత్తగా వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: