స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు ఈరోజు తీపి కబురు అందించింది. ఆ తీపి కబురు ఏంటంటే.. ఇప్పటినుంచి బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అంటే.. ఉదాహరణకు ఎస్బీఐ లో మీకు ఖాతా ఉందనుకోండి.. ఆ ఖాతాలో వారు ఎన్నిక చేసిన డబ్బులను అలానే ఆ ఖాతాలో ఉంచాలి.
అయితే ఇకపై మినిమం బ్యాలెన్స్ నిబంధనను తీసివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. అంటే ఇప్పుడు ఖాతాలో ఒక్క రూపాయి లేకున్నా కూడా బ్యాంక్ అకౌంట్ కు జరిమానా ఇటువంటివి ఉండవన్నమాట. దీంతో ఖాతాదారులకు ఊరట లభించిందనే చెప్పాలి.
కాగా., ఇప్పుడు చేసిన ప్రకటన ప్రకారం.. ఎస్బీఐ వినియోగదారులు తమ పొదుపు ఖాతాలలో కనీస నిల్వను.. మినిమం బాలన్స్ (నెలవారీ) పాటించాల్సిన అవసరం లేదు. దీంతో ఖాతాదారులకు భారీ ఊరట లభించినట్లయింది. దీనితో పాటుగా సేవింగ్ అకౌంట్స్ పై వడ్డీ రేటును సంవత్సరానికి 3 పర్సెంట్ గా నిర్ణయించింది. దేశంలో ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ ప్రోత్సాహ చర్యల్లో భాగంగా మొత్తం 44.51 కోట్ల ఎస్బీఐ ఖాతాల్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేస్టున్నట్టు ఎస్బీఐ తెలిపింది.
అలాగే.. ఎస్ఎంఎస్ ఛార్జీలను కూడా మాఫీ చేసింది ఎస్బీఐ. మరో వైపు ఎస్బీఐ బుధవారం ఎంసీఎల్ఆర్ రేట్లను, డిపాజిట్ల పై బ్యాంకు చెల్లించే వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. కాగా ఎస్బీఐ పొదుపు బ్యాంక్ వినియోగదారుల మెట్రో, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా మూడు వేల రూపాయలు, రెండు వేల రూపాయలు, వెయ్యి రూపాయలను కనీసం నెల మొత్తంలో ఖాతాలో జమ చేయాలి. ఒకవేళ మనం జమ చేయలేదంటే ఈ పన్నులతో పాటు 5 నుంచి 15 రూపాయల వరకు గతంలో ఎస్బీఐ జరిమానా వసూలు చేసిన సంగతి తెలిసిందే.