తరచూ ఒక మాట జనాల మధ్య వినపడుతుంది.. హైటెక్ వ్యభిచారం సిటీ లో  ఉగ్రరూపం దాల్చడం తో కొన్ని నమ్మలేని  నిజాలు వెలుగు చూస్తున్నాయి..ఇక్కడ పేరుకు క్లినిక్ లోపల జరిగేది మాత్రం వ్యభిచారం నిర్వహిస్తున్న పోలీసులు అనుమానిస్తున్నారు.. ఈ మేరకు విచారణ చేపట్టి న పోలీసులు అసలు విషయాలు తెలుసుకొని విస్తుపోయారు.. పేరుకే మసాజ్ సెంటర్ లోపల మాత్రం వ్యభిచారం.. 

 

 


వివరాల్లోకి వెళితే.. తమిళనాడు లోని నాగర్‌ కోయిల్‌ లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందా రట్టయింది. కోట్టార్‌ లో నిర్వహిస్తున్న ఓ మసాజ్‌ సెంటర్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనాథ్‌కు సమాచారం అందింది. దీని పై విచారణ చేయాలని ఏఎస్పీ జవహర్‌‌కు ఆదేశించారు. సిబ్బంది ద్వారా అక్కడ వ్యభిచారం జరుగుతోందని తెలుసుకున్న ఏఎస్పీ సోమవారం ఆకస్మికం గా రైడ్ చేశారు.

 

 


ఈ మేరకు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి వారిని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు వారు వెల్లడించారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి, పాండిచ్చేరి, తిరుపూర్‌ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులను తీసుకొచ్చి అందులో వ్యభిచారం చేయడం మొదలుపెట్టాడు. ఆన్‌లైన్ ద్వారా ప్రకటనలు గుప్పిస్తూ యువకులను ఆకర్షిస్తున్నాడు.

 

 

 

అలా మొదలై న ఆ మసాజ్ లో  అమ్మాయి ల కోసం వచ్చే యువకు ల నుంచి పెద్దమొత్తం లో డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఏఎస్పీ విచారణ లో ఈ సెక్స్ రాకెట్‌ కు సంబంధించి ఎన్నో సంచలన విషయా లు బయట కు వచ్చాయి. అలెగ్జాండర్ వద్ద కు వచ్చే విటుల్లో ప్రముఖులు, సెలబ్రెటీలతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు తెలిసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విటులను పట్టుకొనే పనిలో ఉన్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: