నేటి సమాజంలో మానవ రూపంలో ఉన్న కొంతమంది మృగాళ్లు చేసే అఘాయిత్యాలు వెలుగులోకి వస్తూ సాటి మానవుల ఆగ్రహనికి, అసహ్యానికి కారణమవుతున్నాయి. కామాంధులు ఒంటరిగా కనిపించిన ఆడవారినే కాదు చివరికి ఆడ మూగజీవులు కనిపించినా వాటిమీద పడి తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆవుని గోమాత గా పూజించే మన దేశంలో వాటిపైనే అత్యాచారాలు జరగటం చాలా బాధాకరం. ఇటువంటి దారుణమైన ఒక సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకొని అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది.




వివరాలు తెలుసుకుంటే... కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లా బావోడే ముత్తప్పన్ ఆలయ ప్రాంతానికి చెందిన సుమేష్ అనే 33 ఏళ్ల వ్యక్తి పశువుల కొట్టం లో కట్టేసి ఉన్న ఓ రెండేళ్ల వయసు గల ఆవుని దొంగలించి ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తరువాత ఆ ఆవు మెడలో ఉన్న తాడుని దాని గొంతు చుట్టూ చుట్టి గట్టిగా బిగదీసి చంపేశాడు. అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు. అయితే పశువుల కొట్టం యజమాని మందలోని ఓ ఆవు కనిపించకపోవడంతో గ్రామస్థులతో కలిసి చుట్టుపక్కల అంతా గాలించి చూశాడు. కొంత సమయం తరువాత ఎట్టకేలకు తప్పిపోయిన ఆ ఆవు విగతజీవిగా కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాకైన ఆ యజమాని వెంటనే తేరుకొని పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పశువైద్యులని పిలిపించి ఆవుకి శవ పరీక్ష నిర్వహించగా దానిపై లైంగిక దాడి జరిగిందని తేలింది.



రిపోర్ట్స్ ప్రకారం... నిందితుడు సుమేష్ పై గృహ హింస, దొంగతనం ఇంకా జంతు క్రూరత్వం చట్టం కింద కేసులు నమోదయ్యాయి. సంఘటన స్థలంలో నిందితుడుకి సంబందించిన ఒక గుడ్డ ముక్కని కూడా కేరళ పోలీసులు సేకరించారు. అలాగే అతడిని తలాసేరీ న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఐతే సుమేష్ కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా సుమేష్ జంతువులపై రేప్ చేసిన కేసులో జైలు పాలయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: