హోలీ పండుగ వచ్చిందంటే చాలు ఎంతో సందడి నెలకొంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పూర్తిగా రంగులమయం అయిపోతూ ఉంటుంది హోలీ రోజున. ఊరువాడ అంతా ఒక్కచోట చేరి హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అందరూ ఇలాగే హోలీ సంబరాల్లో మునిగిపోయారు. కానీ కామంతో మూసుకుపోయిన ఓ యువకుడు మాత్రం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మొన్నటికి మొన్న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో ఘటన మరవకముందే... మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తొమ్మిదేళ్ల బాలికపై కామాంధుల చేతిలో బలైపోయినది. ఊరంతా హోలీ వేడుకలు ఎంతో ఆనందంగా గడుపుతున్న సమయంలో... కామంతో ఊగిపోయిన కామాందుడు బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
హోలీ పండుగ సందర్భంగా ఊరిలో పాటలు ఆటలతో వేడుకల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఊరువాడ ప్రజలందరూ పాల్గొని రంగులు చల్లుకుంటూ ఎంతో సందడిగా ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు కామం తో ఊగిపోయాడు.. దీంతో ఇదే అదనుగా భావించి 9 ఏళ్ల బాలికను... పొలాల్లోకి తీసుకెళ్లి అతి దారుణంగా అత్యాచారం చేసి అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. ఇక రాత్రి సమయం అయినప్పటికీ కుమార్తె ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు... పోలీసులను ఆశ్రయించగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఊరికి సమీపంలో గాలిస్తున్న సమయంలో... సదరు 9 ఏళ్ల బాలిక నిస్సహాయ స్థితిలో అచేతనంగా పడి ఉంది. దీంతో వెంటనే ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి సిఫారసు చేసారు.
ఈ క్రమంలోనే వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ సదరు బాలిక మృతి చెందింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా సదరు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆ బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు అనంతరం గొంతునులిమి హత్యా చేయబోయాడు.. ఇంతలో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆ కామాందుడు ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు అని అనుమానిస్తున్నారు పోలీసులు.కాగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో మద్యం సీసాలతో పాటు స్నాక్స్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.