గెలిచే అవకాశం లేకపోయినా తెలుగు దేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో నిలబడుతోందట. ఆ సీటుకు టీడీపీ దళిత నేత వర్ల రామయ్య పోటీ చేస్తారట. దీనిపై వైసీపీ నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. గెలిచే అవకాశం ఉన్నప్పుడు అగ్ర వర్ణాలకు సీటు ఇచ్చి..ఇప్పుడు ఓడిపోయే స్థానంలో దళిత నేత వర్ల రామయ్యను బలి పశువును చేయాలని బాబు ఆలోచిస్తున్నారని దళిత నేతలు మండిపడుతున్నారు. బలహీన వర్గాలంటే చంద్రబాబుకు చులకన అంటూ విమర్శిస్తున్నారు.

 

 

ఇదే సమయంలో దళితులకు చంద్రబాబు ఎలా హ్యాండ్ ఇచ్చారో వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో టీడీపీ దళిత నేత వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.. ఆయన ఆ రోజు అంతా రెడీ చేసి.. ఫ్యామిలీతో ప్రకాశం బ్యారేజీ వరకు వెళ్లిన తరువాత ఈ సారికి కుదరదని వర్లరామయ్యకు చంద్రబాబు హ్యాండ్‌ ఇచ్చారు. ఆ రోజు మూడు రాజ్యసభ సీట్లు అవకాశం ఉంటే గుంటూరు జిల్లా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పుష్పరాజ్‌కు సీటు ఇస్తామని చెప్పి అప్పుడూ మోసం చేశారు. అలాగే మోత్కుపల్లి నరసింహులును గవర్నర్‌ను చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారు.

 

 

గెలిచే అవకాశం ఉన్న రోజుల్లో దళితులకు అవకాశం ఇవ్వకుండా అన్యాయం చేశారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌ విమర్శించారు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఎస్సీలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోందన్నారు.. ఓడిపోయే సీటుకు వర్ల రామయ్యను బలి పశువును చేయడం ఎందుకు.. గెలిచే సమయంలో చంద్రబాబు ఆయన సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చారు.. ఇవాళ ఓడిపోయే సీటుకు పోటీ పెట్టి దళితులపై కపట ప్రేమ చూపుతున్నారు. ఇది దుర్మార్గం.. అంటూ మండిపడ్డారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌.

 

 

బలి ఇవ్వడానికి దళితులు మాత్రమే ఆయనకు దొరికారు. ఇది గెలిచే సీటు అయితే చంద్రబాబు ఆయన కుమారుడినే పెట్టేవారు. ఎందుకంటే మంగళగిరి మాలోకం రేపోమాపో ఎమ్మెల్సీ పదవి పోతుందని గుర్తు చేశారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: