దేశంలో ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కానీ మూడ నమ్మకాల పై వారి నమ్మకాన్ని అలానే ఉంచుతున్నారు కొందరు. ఇలాంటి  మూడ నమ్మకాలను నమ్మి వారి జీవితాలను బలి చేసుకుంటున్నారు. పూజలు చేస్తే సంతానం ప్రాప్తిస్తుందని నమింది ఓ మహిళ. దీంతో తనను నమ్మి ఆశ్రమానికి వచ్చిన ఓ మహిళపై దొంగ స్వామీజి అత్యాచారం చేసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ నగరంలో చోటుచేసుకుంది. 

 

 

 

వివరాల్లోకి వెళితే.. ప్రయాగరాజ్ నగరంలో సంజయ్ అనే సాధువు తమ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు.  అయితే ఈ పూజలో పాల్గొన్న వారికి సంతానం ప్రాప్తిస్తుందని ప్రచారం చేయసాగాడు. దీంతో ఈ విషయాన్ని నమ్మిన ఓ మహిళ, ఆ సాధువును కలిసేందుకు ఆశ్రమానికి వచ్చింది. ఇంకేముంది మహిళ పై ఆ దొంగస్వామి కన్నేశాడు.

 

 

 దొంగ స్వామి పన్నాగం పన్నాడు. ఎలాగైనా సరే ఆ మహిళను  లోబరుచుకోవాలని చూశాడు. ఈ నేపధ్యంలో ఆమెతో ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుందని, దానికి గాను ఏకాంతంగా తనను అర్థరాత్రి కలవాలని సూచించాడు. ఆ దొంగ స్వామిపై అనుమాన పడుతూనే అర్థరాత్రి బాధిత మహిళ స్వామిజీని కలిసింది. 

 

 

 

ఆమెను దొంగ స్వామి మీ దుస్తులను విప్పి ధ్యానం చేయాల్సి ఉంటుందని ఆమెను కోరాడు. దీంతో ఆ మహిళకు అనుమానం కలిగింది. కానీ ఆ అనుమానం ఉన్నా సంతానం కోసం మహిళ స్వామీ చెప్పినట్లు చేసింది. ఆ తర్వాత స్వామీజీ కూడా నగ్నంగా మారాడు.  అనంతరం ఆ మహిళను తన కోరిక తీర్చితే సంతానం కలుగుతుందని ఆమెపై బలవంతం చేశాడు. అందుకు ఆ మహిళ తిరస్కరించింది. కానీ ఆ  దొంగ స్వామి మహిళలపై అత్యాచారం చేసి తన కోరికను తీర్చుకున్నాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు సాధువుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: