ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల వల్ల సంసారాలను నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. వివాహేతర సంబంధాలు ఎన్నో కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి. అక్రమ సంబంధం మోజులో పడి కొందరు భర్తను, పిల్లలను చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి సంబంధాలు కొంతకాలం బాగానే ఉన్నా ఏదైనా తేడా వస్తే మాత్రం జీవితాలే నాశనమవుతున్నాయి. 
 
హైదరాబాద్ లో ఒక మహిళ భర్తతో గొడవలు రావడంతో కొన్ని నెలలుగా ఒంటరిగా జీవిస్తోంది. కొన్నిరోజుల క్రితం ఆమెకు ఒక రెస్టారెంట్ ఓనర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. విడిపోయినా భార్య అంటే ఎంతో ఇష్టం, ప్రేమ ఉన్న ఆమె భర్త బెడ్రూమ్ లో ప్రియుడితో కలిసి ఉన్న భార్యను చూసి తట్టుకోలేకపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె ప్రియుడిని జైలుకు పంపించాడు.. 
 
పూర్తి వివరాలలోకి వెళితే హైదరాబాద్ లోని లింగంపల్లిలో ఫైనాన్స్ వ్యాపారం చేసే రాజు రేవతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉన్న రేవతి ఆ తర్వాత భర్తను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఒకరోజు రాజు రేవతిని టీ పెట్టమని కోరగా ఆమె ఛాటింగ్ చేస్తూ తన మాటలకు పట్టించుకోవడంతో ఆవేశంలో ఆమెపై చేయి చేసుకున్నాడు. 
 
రేవతి కూడా భర్త చెంపపై కొట్టి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత రాజు బోరబండ లో ఒక బైక్ పై పెట్రోల్ పోస్తూ సైకోలా ప్రవర్తించటం గమనించిన ఒక యువకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా రేవతి అక్రమ సంబంధం వ్యవహారం తెలిసింది. పోలీసులు మహిళతో అక్రమ సంబంధం పెట్తుకున్న రాహుల్ ను అదుపులోకి తీసుకొని రేవతికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ అనంతరం భర్తతో కలిసి జీవించేందుకు రేవతి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: