హైదరాబాద్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది... ఓ భర్త భార్య ను ఇంట్లో పెట్టీ లాక్ చేసుకొని 8 నెలల నుంచి కనిపించకుండా మాయ మయ్యాడు...అసలెందు కు ఇలా మాయ మయ్యాడు అనే విషయాలు మాత్రం ఆసక్తి గా మారింది..ఏమయ్యాడో తెలియక అందరికీ అయోమయం. అంతలోపే ఇంట్లో ఉన్న భార్యకు కిటికీల ద్వారా బయటివారు భోజనం అందిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం ఆనోటా, ఈ నోటా పొక్కడంతో అధికారులు అక్కడికి చేరుకుని భార్యను వృద్ధాశ్రమానికి తరలించారు.

 

 


ఆమె భర్త కోసం వెతకడం ప్రారంభించారు. చివరికి ఏపీలోని కృష్ణాజిల్లాలో అతని ఆచూకీ కోసం వెతికారు.ఆమెను వదిలేసి తన స్వగ్రామమైన కృష్ణా జిల్లాకు వెళ్లినట్లు సమాచారం. ఏపీలోని కృష్ణాజిల్లాలో గతంలో వీఆర్వోగా పనిచేసిన గంగాధర్ కొన్నేళ్లక్రితం రిటైర్ అయ్యారు. ఆ తర్వాత భార్యతో కలిసి హైదరాబాద్ కు వలస వచ్చారు. భార్య బేబీతో కలిసి ముషీరాబాద్ అడిక్ మెట్ డివిజన్ గణేష్ నగర్లో నివాసం ఉంటున్నారు. 

 

 

 

రిటైర్డ్ ఉద్యోగి కావడంతో కొన్నేళ్లుగా ఇంట్లోనే ఉన్న గంగాధర్.. ఆ తర్వాత పెండింగ్ పనుల కోసం కృష్ణాజిల్లాలోని స్వస్ధలానికి వెళ్లాలని భావించారు.అయితే భార్యను అక్కడ ఇక్కడా తిప్పడం ఇష్టం లేని ఆయన భార్యను హైదరాబాద్లో వదిలేసి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్నీ భార్యకు చెప్పక పోవడం గమనార్హం. దీంతో ఆమె స్థానికులకు సామాచారం అందించింది. 

 

 


స్థానికుల సామాచారం మేరకు ఏపీ పోలీసుల సాయం కూడా కోరారు. చివరికి ఏపీ పోలీసులు గంగాధర్ కృష్ణా జిల్లా అవనిగడ్డలో గంగాధర్ ఉన్నట్లు అక్కడి అధికారుల నుంచి సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక అధికారులు అతన్ని రప్పించి భార్యను ఉంచిన కరుణ రథం వృద్ధాశ్రమానికి తీసుకువెళ్లారు. జరిగిన విషయాన్నీ భర్త వెల్లడించడంతో అన్నీ సర్దుమణిగాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: