రాను రాను లోకంలో మనుషులకు ఓపిక లేకుండా పోతుంది.. చీటికి మాటికి చికాకు పడటం, అరచుకోవడం, గొడవలు పడటం జరుగుతుంది.. ఇక భార్యభర్తల విషయంలో అయితే చెప్పవలసిన అవసరం లేదు.. ఎవరో నూటికి ఒకరిద్దరు మాత్రమే అన్యోన్యదంపతులుగా కీర్తించబడుతున్నారు.. దాదాపు దంపతుల మధ్య అవగహనలోపంతోనే విడాకుల వరకు వెళ్లుతున్నారు.. చక్కని సంసారాన్ని పాడు చేసుకుంటున్నారు.. ఇలాంటి దంపతుల్లో ఒక వింత దంపతుల విషయాన్ని తెలుసుకుంటే వీళ్లపిచ్చి పాడుగాను అనిపిస్తుంది...

 

 

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే.. జుహపుర ఏరియాలో ఉన్న రెహనుమా అనే సొసైటీలో 66 ఏళ్ల సబ్బిర్ గాంధీ అనే వ్యక్తి తన భార్య జాలీతో కలిసి నివసిస్తున్నాడు. ఇతనికి పాల్ది ప్రాంతంలో ట్రావెల్స్ ఏజెన్సీ ఉంది. కాగా రోజూ బిజినిస్ నిమిత్తం ఆఫీసుకు వెళ్లిరావడం చేస్తుంటాడు.. అయితే రోజులాగే... తన ఆఫీసుకు వెళ్లే సమయానికి సబ్బిర్‌ భార్య అతని బెడ్ రూంలోకి వచ్చి అతని బాత్ రూంలో స్నానం చేస్తానని చెప్పగా, తన బెడ్ రూంలో ఉన్న బాత్ రూంలో ఆమె స్నానం చేయడాన్ని అతడు నిరాకరించగా, ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది.

 

 

దీనికి కోపంతో ఊగిపోయిన జాలీ.. భర్తను చెడా మడా తిట్టేసి, పోలీస్ కేసు పెడతానని వార్నింగ్  కూడా ఇచ్చింది. దీంతో ఆమె భర్త తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు విన్న ఆ పోలీసులు ఆశ్చర్యంతో బాత్ రూం విషయంలో భార్యాభర్తలు గొడవ పడటం ఏంటని ప్రశ్నించారు. జరిగిందేదో జరిగిందని సర్ధిచెబుతుండగా ఆ భర్త కాంప్రమైజ్ కాకపోవడంతో చివరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు... ఇక ఇద్దరు మతిలేని మనుషులు చేసిన పనిని తెలుసుకున్న నెటిజన్స్ మాత్రం బాత్రూం విషయంలో స్నానం చేస్తానని అన్నందుకు ఆ బుద్ధిలేని భర్త ఇలా ప్రవర్తించడం సరికాదంటూ అక్షింతలు వేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: