కరోనా వైరస్ ఎఫెక్ట్ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఒక్క చైనాలోనే కాకుండా ప్రపంచ ఆర్థిక లాభా దేవీలపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే చాల మంది ప్రయాణికులు వారి ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. కరోనా వైరస్ దెబ్బకి విమానయాన కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి.
విమానయాన కంపెనీలు వరుసపెట్టి డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో స్పైస్జెట్ దారిలోనే ఇప్పుడు గోఎయిర్ కూడా నడుస్తోంది. ఈ ఎయిర్ లైన్స్ ఇప్పుడు సమ్మర్ సేల్ ప్రకటించింది. గోఎయిర్ సమ్మర్ సేల్లో భాగంగా విమాన ప్రయాణం చేసే వారు రూ.955కే టికెట్ పొందొచ్చు.
ఇది ఈ ఆఫర్ దేశీ విమాన ప్రయాణానికి వర్తిస్తుంది. అదే మీరు విమానంలో విదేశాలకు వెళ్లాలంటే అప్పుడు టికెట్ ధర రూ.5,490 నుంచి ప్రారంభమౌతోంది. అంతేకాకుండా గోఎయిర్ మరో ఆఫర్ కూడా ప్రయాణికుల ముందుంచింది. జీరో రీషెడ్యూల్డ్ ఫీజు ఆప్షన్ కల్పిస్తోంది.
గోఎయిర్ డిస్కౌంట్ ఆఫర్ గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. మార్చి 14 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. సమ్మర్ సేల్లో భాగంగా టికెట్ బుక్ చేసుకున్న వారు ఏప్రిల్ 15 నుంచి జూన్ 30లోపు మధ్యలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు.
గోఎయిర్ కంపెనీ ఆఫర్లో భాగంగా ఎన్ని సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది వెల్లడించలేదు. ఇకపోతే ఈ ఆఫర్ ఇతర ప్రమోషనల్ ఆఫర్లు, ప్రోమోకోడ్స్కు వర్తించదు. అంటే రెండింటినీ ఒకేసారి ఉపయోగించలేం. అలాగే గ్రూప్ బుకింగ్స్కు కూడా ఈ ఆఫర్ అందుబాటులో లేదు. కంపెనీ సోషల్ మీడియా వేదికగా ఆఫర్ విషయాన్ని వెల్లడించింది.
స్పైస్జెట్ కూడా స్ప్రింగ్ సీజన్ సేల్ ఆఫర్లో భాగంగా దేశీ విమాన టికెట్ను రూ.987 ధరకే అందిస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ ప్రయాణానికి టికెట్ ధర రూ.3,699 నుంచి ప్రారంభమౌతోంది. ఈ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. మార్చి 15 వరకు ప్రయాణికులు ఈ ఆఫర్ను సొంతం చేసుకోవచ్చు.