యాదాద్రి సమీపంలో జరిగిన ఈ రెండు విషయాలు సేమ్ టు సేమ్.. సూర్యాపేట జిల్లాల్లో కలకలం రేపుతున్న   రెండు వేరు వేరు ఘటనల్లో సదరు మహిళలు ఇద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరిది ఒకటే దారి.. మొగుళ్లను మరిచి, ప్రియుళ్ళతో సహజీవనంలో మునిగి తేలుతున్న వారి ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉందని వారు అపోహ పడ్డారు. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా.. చేసిన కర్మే వారిని బలిగొంది. అవును... మొగుళ్ళ కంటే ముద్దుగా వున్న వారు ప్రియుళ్లే వారు పాలిట కాల యములు అయ్యారు. జరిగిన విషయాలను ఒకసారి తరచి చేసుకున్నట్లైతే..

 

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు చెందిన ఓ మహిళ, అదే గ్రామానికి చెందిన ఊదరి రమేష్‌తో కొంతకాలం కామ కలాపాలు నెరిపింది. అయితే కొన్నాళ్ల తర్వాత రమేష్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడంతో మొదటి అమ్మాయి రమేష్ ను దూరం పెట్టింది. అయితే పెళ్లయిన తరువాత కూడా రమేష్ తనతో సంబంధాన్ని కొనసాగించాలని అనుకున్నాడు. దానికి సదరు యువతి ఒప్పుకోలేదు. 

 

కోపాన్ని అదుపు చేసుకోలేని రమేష్, పీకలదాకా తాగి మద్యం మత్తులో ఆమెను హత్య చేశాడు. అనంతరం దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేయడానికి ప్రయత్నించి, విఫలమయ్యాడు. విషయం తెలిసిన పోలీసులు వారి వారి స్టైల్ లో రమేష్ ను విచారించారు. ఇక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో రమేష్ నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. ప్రస్తుతం రమేష్ పోలీస్టేషన్ ఊచలు లెక్క పెడుతున్నాడు.

 

మరో ఘటనలో... రెండేళ్లు క్రితం భర్తను కోల్పోయిన ఒక మహిళ, వీరాచారి అనే యువకుడితో ఆమె కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లల బాధ్యతలు పట్టని సదరు మహిళ వీరాచారి తో తరచూ కామ కార్యకలాపాలు కొనసాగిస్తూ వుంది... ఒకరోజు ఆమె కుమార్తె స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందని... అమ్మను ఆహ్వానించింది. దానికి ఆమె సరే అని చెప్పి, వీరాచారిని అక్కడకు నాన్నగా రమ్మని అడిగిందట. దానికి వీరాచారి సరేనని చెప్పి.. ఇద్దరూ స్కూల్ కు బయలుదేరారు. కానీ మార్గమధ్యంలో అనూహ్యంగా వీరాచారి ఆమెపై దాడి చేసి, విచక్షణా రహితంగా కత్తితో పొడిచేసాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె తనువు చాలించింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: