అవును ఆ సిటీ పేరు చెబితేనే మనుషులకు రక రకాలైన విషయాలు గుర్తుకొస్తాయి.. మొదటిది పొల్యూషన్... ఇక రెండవది.. ఇల్లీగల్ కార్యకలాపాలు. దేశ రాజధాని అని చెప్పుకునేందుకు ప్రతి ఒక్కరు సిగ్గుపడే విధంగా తయారైన సిటీ అది. ఇక ఇటీవల జరిగిన ఈ సంఘటనను పరిశీలిస్తే.. ఢిల్లీ మీద ఏహ్య భావం కలగక మానదు. ప్రతి చిన్న విషయానికి మనిషిని తోటి మనిషిని చంపే విష సంస్కృతి అక్కడ మనం చూడవచ్చును... ఇక వివరాల్లోకి వెళితే,

 

ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన అందరిని నివ్వెర పోయేలా చేసింది.  ఓ వ్యక్తిని అతి దారుణంగా చంపి, అతడి శవంతో వారి కామవాంఛను తీర్చుకున్నారు ఆ కరడు కట్టిన క్రూర కామ మృగాళ్లు. వారి మధ్య జరిగిన ఓ చిన్న గొడవ నేపథ్యంలో ఈ దారుణానికి వారు ఒడిగట్టినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జార్ఖండ్‌, బీహార్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులు దక్షిణ ఢిల్లీలోని నెబ్‌ సరై ఏరియాలో నివాసం వుంటున్నారు. వారికి అదే ప్రాంతంలో సమీపంలో వున్న సదరు బాధితుడితో పరిచయం ఏర్పడింది.

 

రెండు రోజుల క్రితం, ఆ రాత్రి వారు మృతుడి ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారట. ఈ టైం లో అతడితో వారికి చిన్న వాగ్వాదం చోటు చేసుకుందట. ఆగ్రహానికి గురైన అవతలి వారు ఇద్దరూ కలిసి అతడ్ని గొంతునులిమి ఊపిరి సలప కుండా చేసి అత్యంత కిరాతకంగా చంపి, తరువాత శవంతో తమ తీవ్ర తరమైన కామ వాంఛ తీర్చుకున్నారు. ఇక ఆ రాత్రి అక్కడినుంచి వారు పారిపోయి మరలా శవాన్ని మాయం చేయటానికి ఈ బుధవారం ఉదయం మళ్లీ ఆ ఇంటి వద్దకు వచ్చారు. 

 

ఇరువురు శవాన్ని తరలిస్తున్న సమయంలో, మృతుడి చెల్లెలు వారిని చూసి, గట్టిగా అరవటంతో ఇరుగు పొరుగు వారు అక్కడకు చేరుకున్నారట. అయితే అక్కడినుంచి నిందితులు పారిపోయారట. సోదరుడి దారుణ హత్యపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను పాట్నాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గొడవ కారణంగానే అతడ్ని చంపి, రేప్ చేసినట్లు విచారణలో వారు అంగీకరించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: