గుంటూరులో కూరగాయల కోసం వెళ్లిన 17 సంవత్సరాల బాలిక మిస్సింగ్  కలకలం రేపుతోంది. ఇంటికి సమీపంలోని కూరగాయల షాపుకు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసి వస్తానని చెప్పిన బాలిక ఎంతసేపటికీ తిరిగి రాలేదు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక కిడ్నాప్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
టమాటాలు తీసుకొనివస్తానని వెళ్లిన బాలిక ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. గతంలో ఇదే ప్రాంతానికి చెందిన ఒక యువతి కిడ్నాప్ కు గురై శవమై తేలింది. 
 
జ్యోతి అనే వివాహితను ఆమె ప్రియుడు మాయమాటలు చెప్పి తీసుకొనివెళ్లి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తమపై ఎవరో దాడి చేశారని... ఆ దాడిలో జ్యోతి చనిపోయిందని నమ్మించాలనే ప్రయత్నం చేశాడు. పోలీసులు దర్యాప్తులో భాగంగా వివాహిత ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఈ కేసు అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. గుంటూరు చానల్ కాల్వలో ఇదే ప్రాంతానికి చెందిన మరో వివాహిత శవమై తేలింది. మంగళగిరి సమీపంలో కొన్ని రోజుల క్రితం ఒక వివాహితపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు బాధితురాలిని నగ్నంగా వదిలేసి వెళ్లడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. తాజాగా మరో బాలిక మిస్సింగ్ కేసు నమోదు కావడం గమనార్హం. సీఎం నివాసానికి దగ్గరగా ఉండే ప్రాంతాలలో ఈ ఘటనలు చోటు చేసుకోవడం మరింతగా ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.                                

మరింత సమాచారం తెలుసుకోండి: