నేటి సమాజంలో భార్య భర్తలు చిన్న కారణాలకే పెద్ద తగాదాలు పెట్టుకుంటూ తమ ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. భార్య అంటే భర్తకు విలువ ఉండదు, భర్త అంటే భార్యకి విలువ ఉండదు. వాళ్ళ మధ్య ప్రేమానుబంధాలు ఉంటాయో లేదో కానీ అనుమానం మాత్రం బీభత్సంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ అనుమానం వలనే వివాహ బంధాలు నీటిమీద రాతలు లాగా నిలవలేక పోతున్నాయి. అనుమానం కారణంగా ఒక భర్త భార్య ని చంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన ఫిరోజాబాద్ లో చోటు చేసుకుంది.

 



వివరాలు చూసుకుంటే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లాలోని భాడి గ్రామంలో అన్వేష్(30), స్వప్న(24) దంపతులు నివసిస్తున్నారు. ఐతే బుధవారం రోజు బయటికి వెళ్ళిన తన భర్త ఎన్ని గంటలు గడిచినా ఇంటికి రాలేదు. దీంతో ఆమె తన భర్త కోసం వేచి చూడ సాగింది. ఎట్టకేలకు అవనీష్ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. దాంతో అప్పటివరకూ వేచి చూసిన భార్య కోపంతో ఊగిపోతూ ఇంటికి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకయ్యిందని నిలదీసింది. ఆమె అలా ప్రశ్నిస్తుంటే అలసిపోయి వచ్చిన భర్తకి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే బయటికి వెళ్లి ఒక కర్ర తీసుకొచ్చి పిచ్చి కోపంతో ఆమె తలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు భర్త. ఆ కర్ర దెబ్బలకు స్వప్న తలకి తీవ్రంగా గాయాలయ్యాయి.




ఏకంగా తలపైనే బలంగా కొట్టడంతో స్వప్న గట్టిగా అరుస్తూ కుప్పకూలిపోయింది. అరుపులను విన్న చుట్టు పక్కన వాళ్ళు హుటాహుటిన అవనీష్ ఇంటి లోపల కి వచ్చి అతడ్ని అడ్డుకొని భార్యని ఆసుపత్రికి తరలించారు. కానీ భార్య చికిత్స పొందుతూ మరణించింది. మరోవైపు అవనీష్ తన బిడ్డతో పాటు పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అవనీష్ కోసం గాలింపు చేపట్టి వెంటనే పట్టుకొని జైల్లో వేశారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా భర్త త్వరగా ఎందుకు రాలేదనే ప్రశ్న వేయడం వలన స్వప్న తన ప్రాణాలనే కోల్పోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: