తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీ కెసిఆర్ మరియు కేటీఆర్ ని తీవ్రస్థాయిలో గట్టి కౌంటర్ లు వేసే నాయకులు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి. అటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇటువంటి టైం లో రేవంత్ రెడ్డికి పార్టీ నుండి మంచి సపోర్ట్ వస్తుందని అందరూ భావించిన తరుణంలో పార్టీ నుండి ఎవరూ ముందుకు రాకుండా రేవంత్ రెడ్డి ని ఒంటరిని చేసిన సంఘటన చూస్తే ఎవరైనా జాలి పడే పరిస్థితి  ఏర్పడింది. కాగా ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి విషయాన్ని టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. 111 జీవో విషయంలో రేవంత్ రెడ్డి ఎగస్ట్రాలు చేశారని పార్టీపరంగా పోరాడాల్సిన రేవంత్ రెడ్డి సొంత ఇమేజ్ కోసం ఓవరాక్షన్ చేశారని జగ్గారెడ్డి విమర్శించారు.

 

కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ అందరినీ కలుపుకొని పోరాడాలి కానీ...రేవంత్ రెడ్డి మాత్రం తీస్మార్ ఖాన్ లాగా పోరాటం చేశారని సీరియస్ అయ్యారు. అంతేకాకుండా తనపై తన అనుచరులపై రేవంత్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా రేవంత్ రెడ్డికి రాజకీయాల్లో రాణించే దమ్ముంటే కొడంగల్ లో ఎందుకు ఓడిపోయారని...తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానాలు ఎందుకు గెలవలేదని ఎద్దేవా చేశారు.

 

ఈ సందర్భంగా జగ్గా రెడ్డి....రేవంత్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో అనుసరిస్తున్న విధానాన్ని టార్గెట్ చేసుకుని ఢిల్లీలో ఉన్న సీనియర్ నాయకులు సోనియాగాంధీకి రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రేవంత్ రెడ్డి అనుచరులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి  పూనుకున్నారని లెటర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ కోసం పోరాడుతున్న రేవంత్ రెడ్డి పరిస్థితి ఒంటరిపోరు అయిపోయి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఉన్న కొద్దీ రేవంత్ రెడ్డి పై కేసులు ఎక్కువవుతున్నాయి తప్పా తగ్గటం లేదు. మరి రేవంత్ రెడ్డి విషయంలో చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: