జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సినిమాల్లో సూపర్ గా రాణించినా రాజకీయాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారంటున్నారు వైసీపీ నాయకులు. పవన్ కల్యాణ్ పవన్ ఏ స్పృహతో రాజకీయాల్లోకి వచ్చారో అర్ధం కావడం లేదని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు అంటున్నారు. చంద్రబాబు చెప్పేదే పవన్ కల్యాణ్ చేస్తున్నారని సుధాకర్బాబు విమర్శించారు.
ప్రజలకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా అని సుధాకర్బాబు సవాలు విసిరారు. మాచర్లలో టీడీపీ నేతలు లేరా అని సుధాకర్బాబు ప్రశ్నించారు. బోండా ఉమా, బుద్దా వెంకన్నను ఎందుకు మాచర్ల పంపించారని ప్రశ్నించారు. కులాల పేరుతో చిచ్చుపెట్టాలన్నదే చంద్రబాబు కుట్ర అన్నారు. చంద్రబాబు చెప్పేదే పవన్ చేస్తున్నారని విమర్శించారు. పిన్నెళ్లిపై దాడి జరిగితే పవన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.
అంతే కాదు.. చిరంజీవి వల్ల తెచ్చుకున్న పేరు మొత్తం పవన్ చెడగొట్టుకున్నారని సుధాకర్ బాబు విమర్శించారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి జరిగితే పవన్ ఎందుకు మాట్లాడలేదు. మహిళా ఎమ్మెల్యేపై దాడి జరిగితే ఎందుకు స్పందించలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ఎందుకు నోరు మెదపలేదు.. అని సుధాకర్ బాబు ప్రశ్నించారు.
టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్ కల్యాణ్ అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి దరిదాపుల్లో కూడా టీడీపీ, జనసేన-బీజేపీ కూటమి ఉండే పరిస్థితి కనిపించడం లేదు.