అక్రమసంబంధం వల్ల ఇటీవ‌ల కాలంలో ఎంద‌రో ప్రాణాలు కోల్పోతున్నారు. అక్రమసంబంధం అనేది పచ్చటి సంసారాలను ముక్కలుగా విడకొట్టేస్తాయి. ఆనందకరమైన సంసార దాంపత్య జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. మ‌రియు కుటుంబాల‌ను చిన్న‌భిన్నం చేస్తున్నాయి. నీచమైన ఈ చాటుమాటు వ్యవహారాలవలన కుటుంబాలు దూరమై పోతున్నవారు ఎంద‌రో. అక్రమ సంబంధాలపై ప్రతి రోజు వార్తా పత్రికల్లో కథనాలు వస్తున్నా... టీవీల్లో వార్తలు చూస్తున్నా చాలామందిలో మార్పు మాత్రం రావ‌డం లేదు. ఇక తాజాగా త‌ల్లి, భ‌ర్త అక్ర‌మ‌సంబంధానికి ఓ న‌వ‌వ‌ధువు బ‌లైపోయింది.

 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మీర్‌పేట అల్మాస్‌గూడకు చెందిన వేలూరి అనిత చాలా ఏళ్లుగా భర్త బాబురావుతో విడిపోయి పిల్లలతో కలిసి వేరే చోట ఉంటోంది.  పిల్ల‌ల‌ను పోషించేందుకు అనిత క్యాటరింగ్‌ పనులు చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ప్రేమ్‌ నవీన్‌కుమార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది అక్ర‌మ‌సంబంధంగా మారింది. దీంతో నవీన్‌కుమార్‌ తరచూ అనిత ఇంటికి వచ్చివెళ్లేవాడు. అయితే ఎలాగైనా శాశ్వతంగా ఇద్దరూ కలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఓ చెత్త ఆలోచ‌న చేసింది. డిగ్రీ మొదటి సంవత్సరం చదివే అనిత‌ పెద్ద కుమార్తె వందన (19)ను ప్రేమ్‌ నవీన్‌కుమార్ ఇచ్చి గ‌త డిసెంబ‌ర్ 1న పెళ్లి చేసింది. ఇక వివాహ‌మైన త‌ర్వాత  నవీన్‌కుమార్‌ అనితల‌ వివాహేతర సంబంధం కొనసాగింది. 

 

ఇది తెలుసుకున్న వంద‌న స‌హించ‌లేక‌పోయింది. ఏం చేయాలో అర్థంకాని ప‌రిస్థితిలో.. భ‌ర్త న‌వీన్‌కుమార్‌కు విడిగా ఉందామని పలుమార్లు చెప్పిచూసింది. దీంతో త‌ల్లి వ‌నిత‌ ఇంట్లో నుంచి వెళ్లిపోతే తాను చనిపోతానని బెదిరించింది. ఇక భ‌ర్త‌, త‌ల్లి మోసాలు, అక్ర‌మ‌సంబంధంతో తీవ్ర మానసిక వేదనకు గురైన వందన గురువారం రాత్రి సూసైడ్‌నోట్‌ రాసి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ వెంట‌నే మృతురాలి సోదరి సంజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: