శాంతి భద్రతలను సంరక్షిస్తూ.. ప్రజల ప్రాణాల‌కు రక్షణ కల్పిస్తూ.. నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు.. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు. అయితే ప్రజల మాన ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులే పైశాచికత్వం ప్రదర్శించారు. రక్షక భటులే భక్షకభటులయ్యారు. ప్రియుడి ముందే అతని ప్రేయసిపై అతి దారుణంగా ఇద్ద‌రు పోలీసు కానిస్టేబుల్స్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడులోని పుదుచ్చేరిలో శుక్రవారం రాత్రి జరిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన పుదుచ్చేరికి ప్రతి వారాంతపు రోజుల్లో పలువురు ప్రేమజంటలు రావడం పరిపాటి.  

 

ఇలా శుక్రవారం రాత్రి కడలూరుకు చెందిన రెండు ప్రేమ జంటలు పరిసరాల చుట్టి అక్కడ బసచేశారు. ఆ ఏరియాలో వసూళ్లకు తెగబడే ఇద్దరు పోలీసులున్నారు. వాళ్లే సతీష్ కుమార్, సురేష్. లాడ్జిల్లో ప్రేమ జంటలు వస్తుంటారని ఇద్దరికీ తెలుసు. ఈ క్ర‌మంలోనే రెగ్యులర్‌గా లాడ్జిలకు వెళ్లి ప్రేమ జంటల్ని బెదిరించి డబ్బులు లాక్కుంటూ ఉంటారు. తాజాగా లవర్స్ ఉన్న ఆ లాడ్జికి వెళ్లి ఓ రూం డోర్ కొట్టారు. అందులో ఇద్దరు లవర్స్ డోర్ తీశారు. లోపలికి వెళ్లిన కానిస్టేబుళ్లు ఇక్కడ వ్యభిచారం జరుగుతోందని చెప్పి... మిమ్మల్ని ఇద్దర్నీ అరెస్టు చేస్తాం అన‌డంతో.. వాళ్లు భ‌య‌ప‌డి 20 వేలు అప్ప‌చెప్పారు.

 

ఆ తర్వాత మరో ప్రేమజంట వద్దకు వెళ్లి అక్కడా సేమ్ స్టోరీ చెప్పారు పోలీసులు. దీంతో ఇద్దరూ భయపడిపోయారు. అయితే వారి వద్ద తగిన డబ్బు లేకపోవడంతో ప్రియుని కళ్లెదుటే అతని ప్రియురాలిపై ఇద్దరు పోలీసులు దారుణంగా అత్యాచారం చేశారు.  ఈ జరిగిన దారుణం బయటకు చెబితే పరువు పోతుందని భావించిన ఆ జంట ఇంటికి వెళ్లిపోయారు. అయితే, ఈ వ్యవహారం ఎలాగో బయటకు పొక్కింది. సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారుల బృందం విచారణ చేపట్టింది. అత్యాచారం, మామూళ్ల వసూళ్ల సంఘటనలు నిర్ధారణ కావడంతో కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ విష‌యం తెలిసిన జ‌నాలు స‌ద‌రు కానిస్టేబుళ్ల‌ను చీ కొడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: