ప్రస్తుతం ఏపిలో స్థానిక ఎన్నికల సందడి ఏ రేంజ్ లోకొనసాగుతుందో తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపిలో ఎన్నికలు వాయిదా వేసిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ నిర్ణమయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ రమేశ్ కుమార్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాాగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంత విచ్చలవిడిగా ‘కరోనా’ ఉందా? ఏ అధికారులతో మాట్లాడి రమేశ్ కుమార్ చౌదరి నివేదిక తెప్పించుకున్నారు? ఎవరితో సంప్రదించారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గత కొంత కాలంగా చంద్రబాబు నాయడు, పవన్ కళ్యాన్ ఇద్దరూ ఎన్నో రకాలుగా ఎన్నికలను ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

అయితే ఈ మద్య ఇద్దరు నేతలు ప్రజలను రచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే.   బాబు, పవన్ లకు ఎన్నికల వాయిదాకు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటానికి కారణం కరోనా వైరస్ కాదు ‘క్యాస్ట్ వైరస్’ మాత్రమే అని, ‘చౌదరి గారు’ ప్రయత్నం చేస్తే, ‘చంద్రబాబునాయుడు గారు’ వత్తాసు పలుకుతున్నారంటూ ధ్వజమెత్తారు.  ఇప్పడు ఏపిలో కులాల కుంపటి పెడుతున్నారు.. ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకోవడానికి ఏవిధంగా కసరత్తు చేశారో రమేశ్ కుమార్ చెప్పాలని డిమాండ్ చేశారు.  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వల్ల ప్రజలు ఇబ్బందు పడుతున్నారు. 

 

రాష్ట్రంలో ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.  ‘కరోనా’ నివారణకు మందు కనిపెట్టే వరకూ ఎన్నికలు జరగవా? ఏపీలో’ కరోనా’ రూట్ అవుట్ అయ్యే వరకు ఎన్నికలు జరగవా? అని ప్రశ్నించారు. ఎన్నికల వాయిదా కుట్రలో రమేశ్ కుమార్ చౌదరి, చంద్రబాబు భాగస్వాములని, ఇందులో ఇంకా కుట్రదారులెవరో బయటకొస్తారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: