ఆర్నాబ్ గోస్వామి.. కాస్త జాతీయ ఛానళ్లు చూసే అలవాటు ఉన్న తెలుగోళ్లకు కూడా బాగా పరిచయం ఉన్న పేరు. ఆయన ఓ న్యూస్ ఛానల్ యాంకర్.. కానీ అందరిలా రొటీన్ గా యాంకరింగ్ చేయరు. ఆయన లైవ్ డిస్కషన్ కు వెళ్లాలంటే రాజకీయ నాయకులు కూడా హడలిపోతారు. ఆయన ఎదుట ఉన్న రాజకీయ నాయకుడు అని కూడా చూడకుండా కడిగిపారేస్తారు.

 

డైరెక్టుగా నిలదీస్తారు. అరుస్తారు.. కేకలు పెడతారు.. పెడబొబ్బలు పెడతారు.. తిట్టేస్తారు కూడా. అందుకే ఆయన లైవ్ డిస్కషన్లకు మంచి రేటింగులూ ఉంటాయి. అయితే ఇప్పుడు అంతటి ఆర్నాబ్ గోస్వామికి కూడా చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నాడట.. లైవ్ డిస్కషన్లో కాదు సుమా.. చంద్రబాబు తనకు ఎక్కడ పోటీగా వస్తాడో అని ఆర్నాబ్ కంగారు పడుతున్నాడట. నిజంగా కాదు లెండి.. ఓ ఇంగ్లీష్ పత్రిక సరదాగా చంద్రబాబుపై ఇలా సెటైర్ గా రాసింది.

 

 

ఎందుకంటే.. చంద్రబాబు ఇటీవల టీవీ యాంకర్ అవతారం ఎత్తుతున్నారు. కొద్ది రోజుల క్రితం మాచర్ల లో దాడి ఘటనపై చంద్రబాబు మూడుసార్లు మీడియాతో మాట్లాడారు. ప్రెస్ మీట్లను టీడీపీ అనుకూల ఛానళ్లు ఎలాగూ లైవ్ ఇస్తాయి కదా. ఆ క్రమంలో ఆయన ఆర్నాబ్ గోస్వామి తరహాలో అరుపులు, పెడబొబ్బలు పెడుతున్నారు. అంతే కాదు.. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాని పోన్ ఇన్ లో తీసుకుని మాట్లాడించారు. అక్కడితో ఆగారా.. ఆ తర్వాత ఈఅంశంపై వర్ల రామయ్య అభిప్రాయం కోరుతూ మాట్లాడించారు.

 

 

సాధారణంగా ఇలాంటివి టీవీ ఛానళ్లలో యాంకర్లు చేస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అచ్చంగా టీవీలో చేసినట్లే చేశారని ఆ ఇంగ్లీష్ పత్రిక వ్యాఖ్యానించింది. రాజకీయాలలో నలభై ఏళ్ల సీనియర్ అయిన చంద్రబాబు ఈ రంగంలోకి వచ్చినా బాగానే రాణించగలరని కామెంట్ చేసింది. అందుకే ఆర్నాబ్ కంగారు పడుతున్నాడని మొదట్లో చెప్పింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: