ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువయిపోతున్నాయి. వాటివల్ల ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. తప్పు చేసే ముందు ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా. కేవలం పది నిమిషాల సుఖం కోసం ఎంత పని చెయ్యడానికైనా వెనకాడటం లేదు నేటి తరం. ఇంట్లో పని చేసే పనివాడితో వ్యవహారం నడిపింది ఓ ఇల్లాలు దాంతో పరిస్థితులు ఎంతటి దారణానికి ఒడిగట్టాయంటే... ఇలాంటి ఘటన ఒకటి సిరిసిల్లి జిల్లాలో కలకలం రేపింది.
రామోజీపేటకు చెందిన తిరుపతి బద్దెనపల్లిలో షామియానా దుకాణం పెట్టుకుని జీవిస్తున్నాడు. తిరుపతి వద్ద సురేశ్ అనే యువకుడు కొంతకాలంగా పనిచేస్తున్నాడు. తరుచూ ఏదో ఒక పని మీద యజమాని ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. సురేశ్ అతడి భార్యపై కన్నేశాడు. దీంతో ఆమెకు ఏవో మాయమాటలు చెప్పి మమతను లొంగదీసుకున్నాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి తిరుపతికి తెలియకుండా ఇద్దరూ రాసలీలలు కొనసాగిస్తూ వస్తున్నారు.
దీంతో వీరిద్దరు ఎటువంటి తప్పు చెయ్యడానికైనా వెనకాడలేదు. ఇటీవల ఈ విషయాన్ని తెలుసుకున్న తిరుపతి పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. దీంతో భర్త తన సుఖానికి అడ్డొస్తున్నాడని భావించిన మమత అతడిని ఎలాగైనా అడ్డు తొలగించాలని భావించింది. ఇక ఆలస్యం చెయ్యండా వెంటనే ఆ విషయాన్ని ప్రియుడికి చెప్పి ప్లాన్ వేసింది. తిరుపతిని చంపేందుకు సురేశ్ నలుగురు వ్యక్తులకు రూ.40 వేల సుపారీ కూడా ఇచ్చాడు. ఇక వాళ్ళ ప్లాన్ ప్రకారమే శుక్రవారం రాత్రి మమత కడుపునొప్పి వచ్చిందని భర్తను నమ్మించింది. భార్య నొప్పితో విలవిలాడిపోతుందని నమ్మిన భర్త ఆమెను తీసుకుని వెంటనే బస్వాపూర్కు బయలుదేరాడు. అప్పటికే గ్రామ శివారులో అతని కోసం ఎదురు చూస్తున్న సురేశ్, కిరాయి హంతకులు అతడిని అడ్డగించి కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసి చంపేశారు.
భర్త చనిపోయాడని నిర్ధారించుకోగానే వారిద్దరూ కలిసి కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొత్తగా మరో నాటకం మొదలు పెట్టింది మమత ప్రమాదంలో తన భర్త చనిపోయాడని అందరినీ నమ్మించసాగింది. అయితే ఘటనపై అనుమానం వచ్చిన బంధువులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్యగా అనుమానించారు. బాడీని పోస్టుమార్టం చేయగా ఆ రిపోర్టులో అతడికి కిరాతకంగా చంపేశారని రిపోర్ట్ రావడంతో... పోలీసులు మమతను అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో అసలు విషయమంతా చెప్పింది మమత.