వివాహేతర సంబంధం... ఈ పదాన్ని ఈ మధ్య ఎక్కువగా వాడాల్సి వస్తుంది. దీనికి కారణం ఇక్కడ అక్కడ అని లేకుండా ప్రపంచంలో ఏదో ఒక మూలన దీనికి సంబంధించిన వ్యవహారాలు బయటికి వస్తున్నాయి. దీనితో అసలు మానవ సంబంధాలు ఎంత దిగజారాయో అర్థం అవుతున్నాయి. ఇలాంటి మన దేశంలో తక్కువ ఏమి కాదు. దేశంలో రోజు కనీసం రెండు లేదు మూడు సంఘటన్లు బయటికి వస్తుంటాయి. అలాంటి సంఘటనే మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో నేడు ఒకటి జరిగింది. ఇందులో ఈ వ్యవహారానికి  ప్రాణం పోయేంత స్థితి వచ్చింది.

 

 


ఇంకా అసలు విషయానికి వస్తే గుంటూరు జిల్లా దాచేపల్లిలో వివాహేతర సంబంధం ఒక మహిళ ప్రాణం మీదికి వచ్చింది. ప్రియురాలు వేరేవారితో మాట్లాడుతోందన్న కోపంతో ఒక  వ్యక్తి ఆమె గొంతు కోసేశాడు. దీనితో తీవ్ర రక్తస్రావమైన బాధితురాలు ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన షేక్ కాసింబీ(35) గురజాలకు చెందిన బండి శ్రీనివాసరావుతో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.

 

 


ఇది ఇలా ఉండగా ఆమెపై అనుమానం పెంచుకున్న శ్రీనివాసరావు ఆమె ఎవరితో మాట్లాడినా గొడవ చేసేవాడు. "నువ్వు నాకే సొంతం, నువ్వు వేరెవరితోనైనా మాట్లాడితే సహించనని" ఆయన వేధించేవాడు. ఈరోజు ఉదయం అతడు షేక్ కాసింబీ ఇంటికి వెళ్లిన సమయంలో ఆమె మరో వ్యక్తితో మాట్లాడుతోంది. దీనితో రెచ్చిపోయిన అతడు కొడవలితో ఆమె గొంతును కత్తితో కోసేశాడు. అప్పుడు బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోని చూడగా నిందితుడు అప్పటికే పరారయ్యాడు. దింతో రక్తపు మడుగులో ఉన్న ఆమెను వెంటనే దగ్గర్లోని గురజాల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆమెకు అధిక రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు డాక్టర్లు విషయాన్నీ తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి వివరాల్ని సేకరించి కేసు నమోదు చేసుకొని పోలీసులు ఆ నిందితుడి కోసం ముమ్మరంగా జల్లడ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: